SLBC టన్నెల్ ప్రమాదం : తెలియని మృతుల జాడ...మరో రెండు రోజులు...

22 రోజులుగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుని మృత్యువాత పడిన కార్మికుల కోసం నిర్వహిస్తున్న రెస్క్యూ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది. రోజులు గడుస్తున్నా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఇంకా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల జాడ పూర్తిగా తెలియడం లేదు.

New Update
SLBC Tunnel Accident

SLBC Tunnel Accident

 SLBC Tunnel Accident :  22 రోజులుగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుని మృత్యువాత పడిన కార్మికుల కోసం నిర్వహిస్తున్న రెస్క్యూ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది. రోజులు గడుస్తున్నా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఇంకా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల జాడ పూర్తిగా తెలియడం లేదు. 22  రోజులుగా దేశంలోనే నిష్ణాతులైన వివిధ ఏజెన్సీ ల సహాయంతో సొరంగంలో కూరుకుపోయిన కార్మికుల కోసం వెతుకుతున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సొరంగంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

 ఇప్పటికే టన్నెల్లోకి పంపిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోకు అనుసంధానంగా 30 హెచ్‌ పీ సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ ట్యాంక్ తో కూడిన యంత్రాన్ని సహాయక చర్యల కోసం శుక్రవారం సొరంగంలోకి పంపారు. ఎస్ ఎల్ బీ సీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ మరో రెండు రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న యంత్రాలు మట్టిని వేగంగా సమర్థవంతంగా తొలగిస్తాయని భావిస్తున్నారు. 

Also read: TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి


 డి1, డి2 ల వద్ద ఇప్పటికే సింగరేణి, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు నాలుగు మీటర్ల లోతులో మట్టిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలను కట్ చేసి బయటకు తరలిస్తున్న క్రమంలో లోపల రెస్క్యూ ఆపరేషన్ కాస్త ఆలస్యంగా నడుస్తుంది. కార్మికులు తవ్విన మట్టిని ఎప్పటికప్పుడు పొక్లెయినర్ సహాయంతో బయటకు తెస్తున్నారు.

Also Read: తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు.. యూనెస్కో జాబితాలో ముడమాల్‌ నిలువురాళ్లు

 ఇప్పటివరకు రెండు మృతదేహాలను బయటకు తీసుకురాగా, ఇంకా 6 మృతదేహాలను గుర్తించవలసి ఉంది. గత 22 రోజులుగా కేంద్ర, రాష్ట్ర రెస్క్యూ బృందాలు అవిశ్రాంతంగా శ్రమ చేస్తున్నప్పటికీ ఇంకా మృతదేహాలను బయటకు తెచ్చి కుటుంబ సభ్యులకి అందించలేకపోయారు. అయితే మరో రెండు రోజుల్లో మిగతా ఆరు మృతదేహాలను కూడా వెలికి తీస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు తమ వారి కోసం కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.

 Also read: Firing: కాంగ్రెస్ మాజీ MLAపై కాల్పులు.. ఇంటిపై నలుగురు అటాక్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Yashaswini Reddy : ఎర్రబెల్లి నీకు సినిమా చూపిస్తా.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాస్ వార్నింగ్!

మాజీ మంత్రి ఎర్రబెల్లి వయస్సుతో పాటు హుందాతనాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ సత్తా ఏంటో లోకల్ బాడీ ఎన్నికల్లో చూపిస్తామని అన్నారు. ఇప్పుడే కాదు తెలంగాణలో మరోసారి రాబోయేది కూడా కాంగ్రెస్ సర్కారే అంటూ ధీమా వ్యక్తం చేశారు

New Update

పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి విషయంలో తనకో విజన్ ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన అనుకున్న టైమ్ లోపు అన్ని పనులు జరుగుతాయని తేల్చి చెప్పారు.   బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు.  అమ్మాయి చిన్నగా ఉంది.. సాఫ్ట్ గా ఉందని అనుకుంటే అది మీ తప్పే అని అన్నారు.  ఇంకోసారి అత్తాకోడళ్ళు అని ఇష్టమోచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదని..  మీకు అంతా ఇంట్రెస్ట్ ఉంటే అత్తా-కోడళ్ళ సినిమా, సీరియల్ తాను చూపిస్తానని హెచ్చరించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వయస్సుతో పాటు హుందాతనాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. ఏదీ పడితే మాట్లాడితే బాగుండదన్నారు. కాంగ్రెస్ సత్తా ఏంటో లోకల్ బాడీ ఎన్నికల్లో చూపిస్తామని అన్నారు. ఇప్పుడే కాదు తెలంగాణలో మరోసారి రాబోయేది కూడా కాంగ్రెస్ సర్కారే అంటూ ధీమా వ్యక్తం చేశారు.  ఏడాది పాలనకే ఇంత ఫ్రస్టేషన్ కు లోనైతే మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం అయిపోతారో.. ఆరోగ్యాలు చూసుకోవాలంటూ మాస్ వార్ని్ంగ్ ఇచ్చారు. 

ఎర్రబెల్లి బస్తిమే సవాల్

అంతకుముందు రేవంత్ సర్కార్‌ పై మాజీ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ పూర్తి కాగానే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని అన్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చీఫ్ గెస్టుగా పాల్గొని మాట్లాడారు.  స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం భయపడుతుందని అన్నారు.  రాసిపెట్టుకోండి.. స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడ్.. ఎప్పుడు ఎన్నికలు పెట్టిన సరే..  బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమని ఎర్రబెల్లి అన్నారు. సర్వేలన్ని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయన్న  ఎర్రబెల్లి..  ఎన్నికలు పెట్టి చూడండి .. తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు.  తాను చెప్పింది నిజం కాకపోతే  రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎర్రబెల్లి సవాల్ విసిరారు.  మొత్తం రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. అందులో కేవలం 10 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్‌గా ఉందని..  మిగతా చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడుతోందని ఎర్రబెల్లి  స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు