BIG BREAKING: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో బస్సు, కంటైనర్, రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Road Accident Nalgonda

TG Crime: నల్గొండ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో బస్సు, కంటైనర్, రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక ఉన్న కారును కంటైనర్ ఢీకొట్టింది.  ఒక్కసారిగా కారు.. బస్సు కిందికి దూసుకుపోయి ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. మరోకారు అదుపుతప్పి డివైడర్‌ను గుద్దింది. 

ప్రైవేటు బస్సు సడన్‌ బ్రేక్‌ వేసి...


ఇది కూడా చదవండి:
 కండరాల నొప్పులా.. అరటిపండ్లు, కొబ్బరి నీళ్లతో ఇన్ని లాభాలున్నాయా..? కానీ ఇలా ట్రై చేయకండి

ప్రమాదపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతి చెందిన వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉన్నది.  హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయి వాహనదారులు కొద్దీ సేపు ఇబ్బందికి గురయ్యారు. పోలీసులు రోడ్డుపై అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

ఇది కూడా చదవండి: ఛాతీలో మంట, వికారం గుండెపోటుకు కారణమా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TS: ముగిసిన శ్రవణ్ రావు విచారణ..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అడుగు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అడుగు పడింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడుగా ఉన్న శ్రవణ్ రావు విచారణ ముగిసింది. సిట్ అధికారులు అతనిని 11 గంటలపాటూ విచారించారు. 

author-image
By Manogna alamuru
New Update
prabhakar rao, sravan rao

prabhakar rao, sravan rao Photograph: (prabhakar rao, sravan rao)

రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను సంచలనం రేపింది. ఆ వ్యవహారం ఇప్పుడు కాస్త ముందుకు వెళ్ళింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న శ్రవణ్ రావును సిట్ అధికారులు 11 గంటల పాటు విచారించారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు విచారణ కొనసాగింది. ఇందులో పలువురు ప్రముఖుల పేర్లు శ్రవణ్ రావు చెప్పారని తెలుస్తోంది. మరోవైపు అతని దగ్గర నుంచి రెండు ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. వాటిలో ఉన్న కాల్ లాగ్స్, మెసేజ్ లు, వాట్సాప్ చాట్స్ లను కూడా పరిశీలించనున్నారు. దాని ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కోసం ఎవరెవరి నంబర్లు ఇచ్చారనేది శ్రవణ్ ను సిట్ అధికారులు విచారణలో కనుగొన్నారు. దాని ప్రకారం ఈ కేసులో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. 

పూర్తి విచారణ..

ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా పలువురు రాజకీయ నేతలపై సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు సేకరించి పంపినట్లు తెలుస్తోంది. అయితే ఆ నివేదికలు ఎవరి ఆదేశాలతో పంపించబడ్డాయో తెలుసుకునేందుకు సెట్ కృషి చేస్తోంది. అంతేకాదు శ్రవణ్ రావు మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఉద్యోగులతో సంబంధాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా అధికారులు శ్రవణ్ రావును విచారించినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో శ్రవణ్ రావు మీడియేటర్ గా వ్యవహరించినట్టు విచారణలో తెలిసింది. కొంత మంది కీలక రారజకీయ నాయకులకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడితో శ్రవణ్ రావు  విచారణ ముగియలేదని...మరో మూడు రోజుల్లో మళ్ళీ పిలిచే అవకాశం ఉందని సెట్ అధికారులు చెబుతున్నారు. తుది నివేదిక సిద్ధమయ్యే వరకు మరికొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.

today-latest-news-in-telugu | phone-tapping | sit

Also Read:  chidambaram: నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం

 

 

 

Advertisment
Advertisment
Advertisment