Telangana: తెలంగాణపై ఫెంగల్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో వానలు!

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలోని ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

New Update
ap rains

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ తుపాను పుదుచ్చేరి సమీపంలో  తీరం దాటినట్లు భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయని అన్నారు. తుపాను ప్రభావం తమిళనాడుతో పాటుగా.. ఏపీ, తెలంగాణపై ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Also Read: Ap: ఒక్క మెసేజ్‌ చేయాలనిపించలేదా..తమ్ముడు అంటూ లోకేష్‌ ఎమోషనల్ ట్వీట్‌

Fengal Cyclone

నేడు మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,  నల్గొండ, సూర్యాపేట, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కురిసే సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లకపోకవటమే ఉత్తమమని చెబుతున్నారు.

Also Read: విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా..

సోమవారం ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇక తుపాను ప్రభావంతో హైదరాబాద్‌ లో వాతారవణం ఒక్కసారిగా మారింది. 

Also Read: యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా

రెండ్రోజుల క్రితం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండగా.. ప్రస్తుతం సాధారణ వాతావరణం నెలకొంది. రెండ్రోజుల ముందు వరకు కూడా సాధారణ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోగా.. ప్రస్తుతం 20 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండ్రోజులు ఇదే తరహా వాతావరణం నెలకొని ఉండే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఫెంగల్ తుపాను కారణంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల జల్లులు కురిశాయి. దిల్‌సుఖ్ నగర్, ఛైతన్యపురి, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్, రామాంతపూర్, తార్నాక, అబ్సిగూడ, సికింద్రాబాద్, అంబర్‌పేట, మలక్‌పేట, ఏరియాల్లో జల్లులు కురిశాయి. 

Also Read: AP Rains: ఏపీలో భారీ వర్షాల ఎఫెక్ట్.. నేడు స్కూళ్లకు సెలవు

సోమవారం ఉదయం కూడా జల్లులు కురుస్తూనే ఉన్నాయి.  కాగా, ఫెంగల్ తుపాను కారణంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి నడవాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. తమిళనాడులోని చెన్నై ఎయిర్‌పోర్టున తాత్కాలికంగా మూసేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: ఎంత ధైర్యం.. ప్రభాస్‌ను ఏంటి భయ్యా అఘోరీ ఇలా అనేసింది- దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్!

నాకు ప్రభాస్ అంటే ఇష్టం. ఆయన్ను డైరెక్ట్‌గా చూసే రోజు ఎప్పుడొస్తుందో? కలిస్తే ఒక్క సెల్ఫీ అడుగుతాను అని వర్షిణి తెలిపింది. వెంటనే అఘోరీ ఏంటీ ప్రభాస్ గోల ఆపు అనేసింది. అది కాస్త ప్రభాస్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. దీంతో అఘోరీని ట్రోల్ చేస్తున్నారు.

New Update

అందరూ ఊహించినట్లుగానే లేడీ అఘోరీ-శ్రీవర్షిణీ మ్యారేజ్ చేసుకున్నారు. అదీ ఒకసారి కాదు ఏకంగా రెండు సార్లు వివాహం చేసుకున్నారు. మొదటి సారి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్‌లో బ్రహ్మముహుర్తాన తెల్లవారిజామున 4 గంటలకు వర్షిణీ మెడలో అఘోరీ తాళి కట్టింది. రెండోసారి వర్షిణీ ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే బంగారం చైన్‌ను మెడలో వేసి మ్యారేజ్ చేసుకుంది. ఇది గడిచి చాలా రోజులే అయింది. కానీ ఇప్పుడే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

ప్రభాస్ అంటే ఇష్టం

వర్షిణీ మళ్లీ అఘోరీ చెంతకు చేరుకుంది. అక్కడ నుంచి RTVతో లైవ్ లో మాట్లాడిన అఘోరీ-శ్రీవర్షిణీ.. తమ ఇష్యూలోకి ప్రభాస్‌ను లాగారు. ప్రభాస్ లాంటి అబ్బాయిని పెళ్లిచేసుకోవాలనిపించలేదా? అనే ప్రశ్నకు వర్షిణీ మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ లాంటి అబ్బాయి ఉండడని అనుకున్నాను. కేవలం హీరోస్‌లోనే ఇష్టం.. రియల్ లైఫ్‌లో కాదు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

ప్రభాస్‌ను డైరెక్ట్‌గా ఎప్పుడూ చూడలేదు. ఆయన్ను డైరెక్ట్‌గా చూసే రోజు ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నాను. ప్రభాస్‌ను ఫస్ట్ టైం షూటింగ్ లో కానీ ఎక్కడైనా కలిస్తే ఆయన దగ్గరకి వెళ్లి.. హాయ్ సర్ ఐయామ్ బిగ్ ఫ్యాన్‌ ఆఫ్ యు డార్లింగ్ అని చెప్తాను. అంతేకాకుండా ఒక సెల్ఫీ కూడా అడుగుతాను. అఘోరీని కూడా డార్లింగ్ అని పిలిస్తాను’’ అని అఘోరీని డార్లింగ్ అని పిలిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

అయితే వర్షిణీ ప్రభాస్ గురించి మాట్లాడుతుండగా.. సరిగ్గా అప్పుడే అఘోరీ వచ్చి ఏంటీ ప్రభాస్ గోల అని లైవ్‌లో అనేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు చిర్రెత్తిపోయింది. ఒక్కసారిగా వారు షాక్ అయిపోయారు. తమ అభిమాన హీరో గురించి అఘోరీ అలా అనడం ఏంటని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

(aghori | sri varshini | aghori sri varshini | Aghori Sri Varshini Lov | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment