Pastor Praveen: ప్రవీణ్ మృతి కేసు విచారణలో కీలక పరిణామం.. నేడు భార్య విచారణ!

పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసును ఛేదించేందుకు దాదాపు ఐదు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 2, విజయవాడ-రాజమండ్రి మార్గంలో మరో 2 టీమ్స్ వివరాలను సేకరిస్తున్నాయి. మరో టీం ప్రవీణ్ ఫ్యామిలీ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది.

New Update

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఇద్దరు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తున్నారు.  కేసు విచారణ కోసం ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రవీణ్ ప్రయాణించిన ఏరియాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు రెండు బృందాలు విచారణ నిర్వహిస్తున్నాయి. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం మార్గంలో మరో 2 బృందాలు పరిశీలిస్తున్నాయి. 2 మార్గాల్లో సీసీటీవీ ఫుటేజీలు, కేసులో అనుమానం ఉన్న వ్యక్తులను ఆయా బృందాలు విచారణ చేస్తున్నాయి.

మరో వైపు హైదరాబాద్‌లో ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించనున్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్ ను రికార్డు చేయనున్నారు. ఈ కేసును ప్రభుత్వం సైతం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కేసు దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు డీజీపీని అడిగి తెలుసుకుంటున్నారు.

ఎస్పీ కీలక ప్రకటన..

మరో వైపు ప్రవీణ్ మృతిపై తూర్పుగోదావరి ఎస్పీ కీలక ప్రకటన చేశారు. కేసు దర్యాప్తుపై వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్వేషాలు రగిల్చేలా,  మతపరమైన అవాస్తవాలు ప్రచారం చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రవీణ్ మృతిపై ఆధారాలుంటే 9440796620 నంబర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. 

 

( pastor praveen news | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment