హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. ఈ రోజు నుంచి కొత్త రూల్!

నాగోల్ - మియాపూర్ మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ విషయంలో ఎల్ అండ్‌ టీ గత కొద్ది నెలలుగా కాలయాపన చేస్తూ వచ్చింది. నేటి నుంచి ఈ పెయిడ్ పార్కింగ్‌ను అమలు చేయనుంది. ప్రస్తుతం పార్కింగ్ ఏరియాల్లో ఛార్జీల బోర్డులు ఏర్పాటు చేసింది.

New Update
Paid parking,

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలింది. ఇదివరకు నాగోల్ - మియాపూర్ మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ విషయంలో ఎల్ అండ్‌ టీ గత కొద్ది నెలలుగా కాలయాపన చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. పెయిడ్ పార్కింగ్‌ను ఎట్టకేలకు అమలు చేసింది. నేటి నుంచి ఈ పెయిడ్ పార్కింగ్‌ను అమలు చేయనుంది.

ఇది వరకు గతంలో దాదాపు 3 సార్లు బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో కాస్త వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఈ నెల 26న ఆయా మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ తీసుకొస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

ఇది కూడా చదవండి: డీజే టిల్లూ పాటకు మంత్రి కోమటిరెడ్డి డ్యాన్స్-Viral Video

ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్కింగ్ ప్రాంతాల్లో ఛార్జీల బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ ప్రస్తుత పార్కింగ్ ఛార్జీలు చూసుకుంటే గతంలో కంటే ఇప్పుడు కాస్త తగ్గాయి. ఇదిలా ఉంటే దీనిపై మెట్రో ప్రయాణికులు, యువజన సంఘాలు సైతం మండిపడుతున్నాయి. పెయిడ్ పార్కింగ్‌ను వెంటనే రద్దు చేయాలని నాగోల్ స్టేషన్ వద్ద శనివారం నిరసన చేపట్టారు.

గతంలో ఛార్జీలు

టూ వీలర్ 


కనీసం రెండు గంటల వరకు - రూ.10
8 గంటల వరకు - రూ.25
12 గంటల వరకు - రూ.40
12 గంటలు పైబడితే ప్రతీ గంటకు రూ.5

ఫోర్ వీలర్

ఇది  కూడా చదవండి: కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తె అంత్యక్రియలు

2 గంటల వరకు - రూ.30
8 గంటల వరకు - రూ.75
12 గంటల వరకు - రూ.120
12 గంటలకు పైబడితే ప్రతి గంటకు - రూ.15

ప్రస్తుత ఛార్జీలు

టూ వీలర్

0 నుంచి 2 గంటల వరకు - రూ.10
2 నుంచి 3 గంటల వరకు - రూ.15
3 నుంచి 4 గంటల వరకు - రూ.20
4 నుంచి 12 గంటల వరకు - రూ.25

ఫోర్ వీలర్

0 నుంచి 2 గంటల వరకు - రూ.30
2 నుంచి 3 గంటల వరకు - రూ.45
3 నుంచి 4 గంటల వరకు -  రూ.60
4 నుంచి 12 గంటల వరకు - రూ.75గా నిర్ణయించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్‌..  ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!

పహల్గామ్ ఉగ్రదాడి ఇప్పుడు దేశంలోని కొన్ని నగరాలకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు. ముఖ్యంగా ముంబై నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Hyderabad Skywalks4

Hyderabad

Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలోని కొన్ని నగరాలకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు. ముఖ్యంగా ముంబై నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెంటనే హైఅలర్ట్ జారీ చేశారు.

ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

ఈ నగరాల్లోనే..

ఉగ్రవాదుల ఎక్కువగా మెట్రో నగరాలు, జనాభా అధికంగా ఉన్న దగ్గర దాడులు చేస్తారు. గతంలో ముంబైలో వరుస పేలుళ్లు, హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబిని పార్క్, దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల వంటి ముష్కర దాడులను ఇంకా జనం మర్చిపోలేదు. ఈనేపథ్యంలోనే తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశమున్నట్లుగా అంచనా వేశారు.

ఇది కూడా చూడండి: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

ఇది కూడా చూడండి: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. స్టీల్ టిప్డ్ బుల్లెట్లు, AK-47 రైఫిళ్లు, బాడీ కెమెరాలు ధరించిన నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందం హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి జమ్మూ కాశ్మీర్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృతి చెందారు. 

Advertisment
Advertisment
Advertisment