Nizamsagar: నిజాంసాగర్‌ దగ్గర కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజేష్ అనే యువకుడు ఓ మహిళను చంపిన డెడ్‌బాడీ తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. దాస్‌నగర్ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు యువకుడు దొరికిపోయాడు. మృతురాలు కమలగా గుర్తించారు.

New Update
nizamsagar 123

nizamsagar 123 Photograph: (nizamsagar 123)

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజేష్ అనే యువకుడు ఓ మహిళను చంపిన డెడ్‌బాడీ తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. కమల మృతదేహాన్ని తరలిస్తుండగా యువకుడు పోలీసులకు దొరికిపోయాడు. దాస్‌నగర్ శివారులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తు్న్నారు. కారు ఆపకుండా రాజేష్ తప్పించుకు వెళ్లాడు.

Also read: Mallareddy: ఆ హీరోయిన్ కసికసిగా ఉంది.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!

దీంతో అనుమానం వచ్చిన పోలీసులు రాజేష్ కారును వెంబడించారు. నిజాంసాగర్ కెనాల్ ప్రాంతంలో కారును వదిలేసి డ్రైవర్ రాజేష్ పారిపోయాడు. అనంతరం కారును తనిఖీ చేసిన పోలీసులు డిక్కీలో మహిళ శవం కనిపించింది. మృతురాలి పేరు కమలగా గుర్తించారు. రాజేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బంగారం కోసమే సదరు మహిళలను చంపినట్లు రాజేష్ పోలీసుల దర్యాప్తులో ఒప్పుకున్నాడు.

Also read: Maoists encounter: ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. భీకర కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృ‌తి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Kamareddy: పండగపూట విషాదం.. తల్లితోపాటు ముగ్గురు పిల్లలు మృతి

కామారెడ్డి ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఉగాది రోజే నలుగురు మృతి చెందారు. బట్టలు ఉతకడానికి మౌనిక ఆమె ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో కలిసి చెరువుకు వెళ్లింది. చెరువులో దిగిన పిల్లలను కాపాడటానికి ప్రయత్నించిన తల్లి కూడా చనిపోయింది.

New Update
kamareddy 10110

kamareddy 10110 Photograph: (kamareddy 10110)

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పండగపూట కుటుంబంలో నలుగురు మృతి చెందారు. బట్టలు ఉతకడానికి ఆదివారం మౌనిక ఆమె ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకుతో కలిసి చెరువుకు వెళ్లింది. తల్లి బట్టలు ఉతుకుతుండగా  ముగ్గురు పిల్లలు చెరువులోకి స్నానానికి దిగారు. చెరువులో ఓ ప్రదేశంలో లోతైన గుంట ఉంది. అందులో పడి పిల్లలు నీటమునిగారు. వారిని కాపాడేందుకు తల్లి ప్రయత్నించగా ఆమె కూడా నీటమునిగి మరణించింది.

Also read: Transgenders: డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. ట్రైన్‌లో యువకుడిని తొక్కి చంపిన హిజ్రాలు

పిల్లలూ చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు తల్లి మౌనిక(26), పిల్లలు మైథిలీ(10), అక్షర(8), వినయ్ (5)గా గుర్తించారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో గ్రామంలో ఇలా జరగడంతో విషాఛాయలు అలుముకున్నాయి. భార్య తరపు బంధువులు భర్తే హత్య చేశాడని ఆందోళన చేస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Also read: BIG BREAKING: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. రేవంత్ టీంలోకి మరో నలుగురు..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు