Nizamabad: వాటర్ హీటర్ షాక్ కొట్టి వ్యక్తి అక్కడికక్కడే మృతి నిజామాబాద్లోని మహ్మద్ నగర్లో విద్యుత్ ఘాతంతో ఒక వ్యక్తి మరణించారు. బకెట్లో పెట్టిన వాటర్ హీటర్ షాక్ కొట్టడంతో రౌతు సాయిలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. By Manogna alamuru 19 Sep 2024 | నవీకరించబడింది పై 19 Sep 2024 22:56 IST in నిజామాబాద్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Water Heater Shock: నిజామాబాద్ జిల్లా మహ్మద్ నగర్ మండలం తుంకిపల్లిలో షాక్ కొట్టిన వ్యక్తి చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రౌతు సాయిలు హైదరాబాద్ వెళ్ళే క్రమంలో స్నానానికి బకెట్లో వాటర్ హీటర్ పెట్టారు. కాసేపు తర్వాత నీళ్ళు వేడెక్కాయో లేదో చూడ్డానికి, హీటర్ను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయనకు విద్యుదాఘాతం కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు సాయిలుకు భార్య, పిల్లలు ఉన్నారు. కుమారుడు సతీశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: USA: ట్రంప్ ర్యాలీలో పాల్గొన్నవారికి వింత జబ్బు? సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి