కార్తీక మాసం స్పెషల్.. శివయ్య దర్శనానికి పడవ ప్రయాణం, ధర ఎంతంటే?

నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. కార్తీక మాసం రోజు అంటే ఇవాళ్టి నుంచే ఈ టూర్ ప్యాకేజీని పర్యాటక శాఖ ప్రకటించింది. 120 కి.మీ మేర 7గంటల పాటు ఈ ప్రయాణం ఉంటుంది. సుమారు 100మంది టూరిస్టులతో పడవ బయల్దేరింది.

New Update
Nagarjuna Sagar To Srisailam

ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ కొండలు, నల్లమల అడవి అందాలు వాటి మధ్యలోంచి పడవలో ప్రయాణం. ఆహా వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది కదూ. అలాంటి ప్రయాణం మీరు కూడా చేయాలనుకుంటున్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్. మన తెలంగాణలో అలాంటి అందమైన ప్రదేశం ఇప్పుడు ప్రయాణికులను కనువిందు చేస్తుంది. 

Also Read:  నవంబర్‌ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!

నదిలో జల విహారం

కృష్ణా నదిలో జల విహారం చేసే సౌకర్యాన్ని తెలంగాణ పర్యాటక శాఖ అందుబాటులోకి తెచ్చింది. కార్తీక మాసం సందర్భంగా సర్‌ప్రైజ్ చేసింది. మొదటి రోజున (నవంబర్ 02న) టూర్ ప్యాకేజీని పర్యాటక శాఖ ప్రారంభించింది. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని సాగించవచ్చు. 

కాగా గత ఐదేళ్లుగా ఈ లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఎన్నో కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ముఖ్యంగా నాగార్జున సాగర్‌లో సరైన స్థాయిలో వాటర్ లేకపోవడం, కరోనా మహమ్మారి.. ఇలా తదితర కారణాల వల్ల ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి రాలేదు. 

నాగార్జున సాగర్ To శ్రీశైలం

Also Read:  కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...30 మంది!

ఇక ఇప్పుడు అంతా సవ్యంగా సమకూరడంతో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే కార్తీక మాసం మొదటి రోజున దీనిని ప్రారంభించింది. తొలిరోజు లాంచీ ప్రయాణానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు. 

Also read: లెబనాన్‌ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌...కూలిన భారీ భవనాలు!

ఇవాళ నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకు తొలి ఏసీ లాంచీ అయింది. సుమారు 100 మంది టూరిస్టులతో తొలి ప్రయాణం మొదలైంది. మళ్లీ రేపు తిరిగి సాగర్‌‌కు లాంచీ చేరుకోనుంది. ఈ ప్రయాణం దాదాపు 120 కి.మీ దూరం సాగుతుంది. అంత దూరం ప్రయాణానికి దాదాపు 7 గంటల సమయం పడుతుంది.

Also Read: తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..!

ఇక ఈ టూర్ ప్యాకేజీ ధర విషయానికొస్తే.. పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1600 టికెట్‌ ధరను ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ధర కేవలం ఒకసైడుకు మాత్రమే రెండువైపులా అయితే.. పెద్దలకు రూ.3000, పిల్లలకు రూ. 2400గా నిర్ణయించింది. ఈ ప్యాకేజీని వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert:  ఉరుములు..మెరుపులు...ఏడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే?

వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది.

New Update
  Rain Alert For Telangana

Rain Alert

Rain Alert : వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే , మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది. రాబోయే ఏడు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని ఈశాన్య, దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కు మార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!
 
ముఖ్యంగా అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాంలోని గౌహతిలో  భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెండు మూడు గంటల పాటు కురిసిన వర్షం కారణంగా.. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో రాబోయే 24 గంటల్లో అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో కూడా భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!
 
అయితే.. వాయువ్య బీహార్ మీదుగా తుఫాను ఏర్పడిందని.. ఇది మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాబోయే 7 రోజులు ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల22 నుంచి27 మధ్య అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపురలలో కూడా భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
 
ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

 

 

Advertisment
Advertisment
Advertisment