దేశంలో నల్లధనం పెరుగుతోంది.. అంబానీ, అదానీకే అడ్డగోలు మాఫీలు!

బీజేపీ పాలనలో దేశంలో నల్లధనం భారీగా పెరిగిపోయిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేస్తుంటే బీజేపీ మాత్రం అంబానీ, అదానీల మాఫీలు చేస్తుందని మండిపడ్డారు. ఇక్కడ ఉనికిని కాపాడుకునేందుకు తమపై చార్జ్ షీట్ విడుదల చేసిందన్నారు.

New Update
TG Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా!

TG News: రాష్ట్రంలో బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికే తమ ప్రభుత్వంపై చార్జ్ షీట్ విడుదల చేసిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. వడ్లకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన కేంద్రం ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించలేని బీజేపీ రైతుల గురుంచి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సోమవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి.. దేశంలో ఎక్కడ లేనివిధంగా సన్న వడ్లకి తాము రూ. 500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు.

అంబానీ, అదానీలకు వేల కోట్లు మాఫీ..

 
రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉచిత కరెంట్ రాయితీ పొందుతున్నారు. 110 కోట్ల ఉచిత బస్ టికెట్లు ఇచ్చాం. ఏడాదికి 20వేల కోట్ల రూపాయలు వరకు సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రుణమాపి చేస్తున్నారా? యూపీ ప్రభుత్వం హయాంలో సోనియాగాంధీ జాతీయ స్థాయిలో రుణమాపి చేసింది. జాతీయ స్థాయిలో రుణమాఫీ చేసి ఉంటే రాష్ట్రానికి 20 వెల కోట్లు అదా అయ్యేవి. ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలని కూడా అమలు చేస్తాం. బీజేపీ నల్లధనం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు వేస్తాం అన్నారు. కానీ దేశంలో ఇంకా నల్లధనం పెరిగిపోయింది. మేము రైతుల రుణమాఫీ గురుంచి మాట్లాడుతుంటే.. బీజేపీ అంబానీ, అదానీ గురించి ఆలోచిస్తుందని, వాళ్ళకు మాత్రమే వేల కోట్లు మాఫీ చేస్తుందన్నారు. 

ఇది కూడా చదవండి: అర్థంతారంగా రాలిన తార.. సిల్క్‌ స్మిత బయోపిక్ గ్లింప్స్‌

దేశానికి అన్నం పెట్టేది రైతు బీజేపీ పాలనలో నష్టాల్లో కూరుకుపోతున్నాడు. పెట్రోలియం, డీజిల్ 70 ఉంటే ఇప్పుడు 100 పైనే ఉంది. నిత్యావసర ధరలు ఆకాశాని అంటుతున్నాయి. 10 ఏళ్లు బీజేపీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. మేము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీ రాష్ట్రాల్లో అమలు చేయాలంటూ జీవన్ రెడ్డి బీజేపికి సవాల్  చేశారు. 

ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలన్న దీదీ

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

తెలంగాణలో కొత్త బ్రాండ్ల అమ్మకాల అనుమతుల కోసం మద్యం కంపెనీలు ఎగబడుతున్నాయి. ఇప్పటివరకు 92 మద్యం సరఫరా కంపెనీలు 604 కొత్త బ్రాండ్లకు అనుమతి కోరుతూ దరఖాస్తులు పెట్టుకున్నాయి.

New Update
liquor

తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మద్యం అమ్మకాలకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ శాఖ తాజాగా వెల్లడించింది. సంవత్సర కాలంలో సుమారు రూ.35 వేల కోట్ల ఆదాయం.. మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ఖజానాకు చేకూరిందంటే.. లిక్కర్ అమ్మకాలు తెలంగాణలో ఏ రేంజ్‌లో నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ప్రభుత్వం కొత్త బ్రాండ్లను ఆహ్వానించిన నేపథ్యంలో.. దేశీయ, విదేశీ మద్యం కంపెనీల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వందల సంఖ్యలో కొత్త బ్రాండ్ల అమ్మకాల అనుమతుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.

Also Read:Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

కాదా.. మద్యం అమ్మకాల అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని సమాచారం. మొత్తం 604 కొత్త మద్యం బ్రాండ్లకు అమ్మకాల అనుమతులు కోరుతూ 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ దరఖాస్తుల సంఖ్య చూస్తేనే.. తెలంగాణలో లిక్కర్ అమ్మాకల్లో పోటీ ఏ స్థాయికి చేరింది అన్నది ఇట్టే తెలిసిపోతుంది. 

Also Read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం మేరకు.. ఇప్పటివరకు వచ్చిన ఈ దరఖాస్తుల్లో 331 బ్రాండ్లు దేశీయంగా తయారయ్యే ఇండియన్ మెడ్ లిక్కర్ కు చెందినట్టుగా తెలుస్తోంది. అంటే దేశీయ బ్రాండ్లకు తెలంగాణ రాష్ట్రం కీలక మార్కెట్‌గా మారుతోందని స్పష్టమవుతోంది. స్థానికంగా తయారయ్యే మద్యం బ్రాండ్లకి వాణిజ్యంగా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు.. 273 బ్రాండ్లు విదేశీ మద్యం కు చెందినవిగా తెలుస్తోంది. గ్లోబల్ లిక్కర్ కంపెనీలు తెలంగాణ మార్కెట్‌లోకి ప్రవేశించి తమ ఉనికిని పెంచుకునేందుకు ఆసక్తిగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. భారతదేశంలో స్పీడ్‌గా ఎదుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా ఉంది. దీంతో విదేశీ కంపెనీలు ఇక్కడ తమ బ్రాండ్లకు మార్కెట్ ఏర్పాటుచేయాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నాయి.

ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 47 కొత్త కంపెనీలు 386 బ్రాండ్లకు అనుమతులు కోరినట్టు సమాచారం. అలాగే 45 పాత కంపెనీలు 218 బ్రాండ్లకి అనుమతులు కోరినట్టు తెలుస్తోంది. వెల్లువలా వస్తున్న దరఖాస్తులను చూస్తుంటే.. కొత్త కంపెనీలు కూడా తెలంగాణ లిక్కర్ మార్కెట్లో స్థానం సంపాదించేందుకు ఎంత ఉత్సాహంగా ఉన్నాయో తెలుస్తోంది.

అయితే.. తెలంగాణలో మద్యం అమ్మకాలు ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్నాయి. కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం మరింతగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వానికి లిక్కర్ నుంచి వచ్చే ఆదాయం ప్రధాన వనరుగా గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది.అయితే.. ఈ కొత్త బ్రాండ్ల అనుమతుల ప్రక్రియకు సంబంధించి అధికారుల పరిశీలన, నియంత్రణ చర్యలు కీలకంగా మారనున్నాయి. అప్రామాణిక బ్రాండ్లు, నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌లోకి రావాటాన్ని నివారించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Also Read:Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

liquor | telangana | telangana liquor sales | telangana-liquor-shops-tenders | telangana liquor production increase | latest-news | telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment