KTR: పైసా పనిలేదు.. రాష్ట్రానికి లాభం లేదు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!

TG: సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనతో పైసా పని లేదు.. రాష్ట్రానికి లాభం లేదని అన్నారు కేటీఆర్. 10నెలల్లో 25 సార్లు హస్తిన పర్యటనకు రేవంత్ వెళ్లారని అన్నారు. అధిష్టాన పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సీఎం రేవంత్ సిల్వర్ జూబ్లీ చేశాడని సెటైర్లు వేశారు.

New Update
KTR: రాజకీయ కక్షతో రైతులను ఆగం చేయొద్దు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ కీలక సూచన!

MLA KTR : సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శల దాడికి దిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనపై సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన వల్ల పైసా పనిలేదు.. తెలంగాణకు ఉపయోగం లేదంటూ దండించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి సీఎం కూర్చున్న 10 నెలల్లో 25 సార్లు రేవంత్ ఢిల్లీకి వెళ్లారని.. దాదాపు 50 రోజులు అక్కడే ఉన్నారని అన్నారు.

ఇది కూడా చదవండి: నేడు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్

రేవంత్.. సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి!

పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి రేవంత్ అంటూ చురకలు అంటించారు. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు అని ఫైర్ అయ్యారు. అయినను పోయి రావాలె హస్తినకు అని అన్నారు. అన్నదాతల అరిగోసలు..  గాల్లో దీపాల్లా గురుకులాలు.. కుంటుపడ్డ వైద్యం.. గాడి తప్పిన విద్యా వ్యవస్థ.. అయినను పోయి రావాలె హస్తినకు అంటూ ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: నేడు ఢిల్లీకి భట్టి విక్రమార్క.. అధిష్టానంతో కీలక భేటీ!

అయినను పోయి రావాలె హస్తినకు...

మూసి పేరుతో - హైడ్రా (Hydra) పేరుతో  పేదోళ్ల పొట్టలు కొట్టి - 420 హామీలను మడతపెట్టి మూలకు వేశారని మండిపడ్డారు. పండగలు పండగళ్ళా  లేవని.. బతుకమ్మ పండుగ నాడు ఆడబిడ్డల చీరలు అందనేలేవు అని ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో పెన్షన్ పెంచుతామని చెప్పిన మీ మాటలు నమ్మి ఓటు వేసిన అవ్వాతాతలు అనుకున్న పింఛను అందుతలేదన్నారు. తులం  బంగారం జాడనే లేదు.. టీలు లేవు, కుట్టు మిషిన్లు లేవు.. అయినను పోయి రావాలె హస్తినకు అంటూ సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనపై ప్రశ్నలు సంధిస్తూ సెటైర్లు వేశారు కేటీఆర్.

ఇది కూడా చదవండి: జగన్‌కు బిగ్ షాక్.. జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యేలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment