భద్రాద్రి లడ్డూ నెయ్యిపై వివాదం..ఆలయ ఈవోకు మంత్రి సురేఖ వార్నింగ్!

తెలుగు రాష్ట్రాలోని ఆలయాల్లో కల్తీ నెయ్యి వ్యవహారం దుమారమే రేపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆలయాలకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. దీంతో దేవాదాయశాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

New Update
Konda Surekha,

TG News

TG News: విజయ డెయిరీ నెయ్యి కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చేలా వ్యవహరించకూడదని మంత్రి సూచించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి నెయ్యి సరఫరా టెండర్‌ను ఏపీకి చెందిన ప్రైవేట్ సంస్థ రైతు డెయిరీకి అప్పగించడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తారంటూ అధికారులను మంత్రి ప్రశ్నించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంతో  తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ--

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నుంచే నెయ్యి సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  తంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్య అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఏపీకి చెందిన రైతు డెయిరీ సంస్థకు నెయ్యి సరఫరా వర్క్ ఆర్డర్ భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి అప్పగించడంపై కొండాసురేఖ మండిపడ్డారు.

ఇది  కూడా చదవండి: జగిత్యాల గురుకులంలో కలకలం.. ఇద్దరు విద్యార్థులకు పాము కాటు!

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈవో రమాదేవికి ఛార్జ్‌మెమో జారీ చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీకే నెయ్యి సరఫరా కాంట్రాక్టు అప్పగించాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. భద్రాచలం రామాలయ ఈవో రమాదేవిని తిరిగి తన మాతృశాఖకు సరెండర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రంగంలోకి 6 పైర్ ఇంజన్లు!

 

ఇది కూడా చదవండి: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించే అల్లం


ఇది కూడా చదవండి:
ఉదయాన్నే తుమ్ముల సమస్య నుంచి ఇలా బయటపడండి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment