Medigadda Barrage: కాళేశ్వరం కీలక ఫైల్స్ మాయం.. దీని వెనక ఉంది ఎవరు?

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కీలక ఫైల్ మాయమవడం కలకలం రేపింది. మేడిగడ్డ బ్యారేజీకి క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్సయినట్లు కమిషన్ విచారణలో అధికారులు తెలిపారు. ఈ ఫైల్స్ మిస్ అవ్వడం వెనక ఒక మాజీ మంత్రి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

New Update
Medigadda Project : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల విషయంలో కమిటీ ఏర్పాటు

Kaleshwaram Files : గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలతో తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్.. దీనిపై విచారణకు జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ముందు కుంగిన మేడిగడ్డ బ్యారేజిపై విచారణను వేగవంతం చేసింది జ్యుడీషియల్​ కమిషన్​. ఈ క్రమంలో నిన్న విచారణకు అధికారులకు పిలిచింది. అయితే ఈ మేడిగడ్డ బ్యారేజి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయం అవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. 

Also Read :  కల్తీ నెయ్యి గుట్టు విప్పుతున్న సిట్.. ఆ కోణంలో విచారణ!

ముందే ప్రిపేర్ అయ్యి..! 

నిన్న విచారణకు వచ్చిన లోవర్ క్యాడర్ ఇంజినీరింగ్ అధికారులు బ్యారేజీ నిర్మాణంలో పాటించిన నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించే రిజిస్టర్లు అందుబాటులో లేవని కమిషన్ ముందు చెప్పారు. వారు చెప్పిన సమాధానం విన్న  కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ షాక్ అయ్యారు. అధికారులపై `సీరియస్ అయ్యారు. కీలకమైన ప్రాజెక్ట్ ఫైల్స్ ను  జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం లేదని అని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్ట్ లో అధికారులు ఇంత అజాగ్రత్తగా ఉంటారా? అని నిలదీశారు. కాగా నిన్న ఓపెన్ కోర్టు ద్వారా 18 మంది ఏఈఈ, డీఈఈలను కమిషన్​ విచారించింది. కాగా ఈ విచారణలో అధికారులు అంత అడిగిన ప్రశ్నలకు ఒకే విధంగా సమాధానం చెప్పడంపై జస్టిస్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు, అందరు ముందే ప్లాన్ చేసుకొని వచ్చి ఒకటే సమాధానం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఇలా ఒకే సమాధానం చెప్తే తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

Also Read :  సీఎం పదవికి ఎకనాథ్ షిండే రాజీనామా!

ఫైల్స్ మాయం వెనుక మాజీ మంత్రి?

కాగా మేడిగడ్డ కుంగిపోవడంపై విచారణ జరుగుతున్న సమయంలో మెయింటెనెన్స్ కు సంబంధించిన రిజిస్టర్లు మాయం అవ్వడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఈ ఫైల్స్ మాయం కావడం వెనుక ఒక మాజీ మంత్రి హస్తం ఉందనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ఇంతకు ఆ మాజీ మంత్రి ఎవరు అనే దానిపై నెటిజన్లు ఇంటర్నెట్ లో వెతుకులాట ప్రారంభించారట. కాగా ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. విచారణకు హాజరైన అధికారులు అంత గత సీఎం చెప్పినట్టే చేశామని జ్యుడీషియల్ కమిషన్ ఎదుట సమాధానాలు చెప్పి కేసీఆర్ పై నెట్టేసినట్లు సమాచారం. కేసీఆర్ తో పాటు ఆ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు పేరు కూడా అధికారులు కమిషన్ ముందు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఏ క్షణమైన కేసీఆర్ ను అదుపులోకి తీసుకుంటారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే మాయమైన ఫైల్స్ పై కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Also Read :  RBI GOVERNOR: ఆర్బీఐ గవర్నర్‌‌కు గుండెపోటు!

Also Read :  POCSO: వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

New Update
Rains

Rains

 Rain Alert : ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వరుణుడు కూడా తన సత్తా చాటుతున్నాడు. పొద్దంతా ఎండలు రాత్రి వర్షాలు అన్నట్లు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా

నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉందని, ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి.. రాగల 24గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనంగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


 ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఈ క్రమంలో మంగళవారం ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 11న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Also read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

Advertisment
Advertisment
Advertisment