ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్లో చేరిన బాబుమోహన్ కొడుకు..
ఆందోల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబు మోహన్కు బిగ్ షాక్ తగిలింది. ఆయన తనయుడు ఉదయ్ బీజేపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఆందోల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబు మోహన్కు బిగ్ షాక్ తగిలింది. ఆయన తనయుడు ఉదయ్ బీజేపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
తండ్రి అస్థికలను గంగలో కలపడానికి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు నీటిలో కొట్టుకుపోయిన ఘటన మెదక్ లో జరిగింది. హర్యా సింగ్, బాల్ సింగ్ మెదక్- కామారెడ్డి సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు వద్ద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు.
సినిమా యాక్టర్లను వచ్చినా...పవన్ కల్యాణ్ ను తీసుకొచ్చినా..నార్త్ లీడర్లను తీసుకువచ్చినా...తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే అన్నారు పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులంతా బచ్చాగాళ్లు...గాళ్లతో నాకేం పోటీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
నర్సాపూర్ కాంగ్రెస్ నేత గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. గురువారం నర్సాపూర్లో జరుగనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్కి రాజీనామా చేసిన అనిల్ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు.
తెలంగాణ ఎన్నికల్లో దుబ్బాక ఈసారి హాట్ ఫేవరెట్గా నిలవనుంది. బీజేపీ ఫైర్ బ్రాండ్, సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తెలంగాణ తుది జాబితా వచ్చేసింది. 119 నియోజకవర్గాల్లో అందరి ఫోకస్ గజ్వేల్, కామారెడ్డిపైనే ఉంది. రెండు నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలు నామినేషన్లు వేశారు. మొత్తానికి గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ తో మొత్తం 83మంది బరిలో ఉన్నట్లు తేలింది.
కేసీఆర్ ఇవాళ(నవంబర్ 9) రెండు స్థానాలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 -12 గంటల మధ్య గజ్వేల్లో నామినేషన్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్ సమర్పించనున్నారు.
బీ ఫామ్ నాదే...పటాన్ చెరు గడ్డమీద గెలుపు నాదే అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు. సీఎం కేసీఆర్ కు తన దమ్ము ఏంటో తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచినా, ఓడినా తాను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని తెలిపారు.
బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తొమ్మిది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. వాస్తవాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే.. ప్రజా అనుకూల విధానాలను సాధించే ప్రయత్నం చేసి ప్రభుత్వం దాడులు చేస్తోందని కోదండరామ్ ఆరోపించారు.