BIG BREAKING: నిజామాబాద్‌లో హైటెన్షన్.. మేయర్ భర్తపై సుత్తెతో దాడి!

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని నాగారంలో కార్పొరేటర్‌ ఆఫీస్ దగ్గర నగర మేయర్‌ నీతూకిరణ్‌ భర్త, బీఆర్ఎస్‌ నాయకుడు దండు చంద్రశేఖర్‌పై దాడి చేశారు. చంద్రశేఖర్, ఆయన అనుచరులను ఆటో డ్రైవర్‌ షేక్‌ రసూల్‌ అక్కడికి చేరుకొని దూషిస్తూ సుత్తెతో ముఖంపై దాడి చేశాడు.

New Update
Nizamabad

Nizamabad

TG News: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. నగర మేయర్‌ నీతూ కిరణ్‌ భర్త, బీఆర్ఎస్‌  నాయకుడు దండు చంద్రశేఖర్‌పై దాడి జరిగింది. దీంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో కార్పొరేటర్‌ కార్యాలయం దగ్గర చంద్రశేఖర్, ఆయన అనుచరులు నిల్చొని ఉన్నారు. ఈ సమయంలో ఆటో డ్రైవర్‌ షేక్‌ రసూల్‌ అక్కడికి చేరుకొని దూషించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో  చేతితో ముఖంపై దాడి చేశాడు. దీంతో చంద్రశేఖర్‌ కిందపడిపోయారు. 


 

Also Read: Movies: నాగ చైతన్య–శోభిత పెళ్ళి శుభలేఖ వచ్చేసింది..చూశారా

తప్పన ప్రాణాపాయం:

అక్కడే ఉన్న చంద్రశేఖర్ అనుచరుల్ని బెదిరించడంతో వారు  ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయినట్లు తెలుస్తోంది. అనంతరం ఆటోలో తన వెంట తెచ్చుకున్న సుత్తెతో చంద్రశేఖర్‌ ముఖంపై రసూల్‌ కట్టిగా కొట్టాడు. దీంతో చంద్రశేఖర్‌ దవడ పైభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చంద్రశేఖర్‌ని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. చంద్రశేఖర్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రశేఖర్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఏసీపీ తెలిపారు. దండు చంద్రశేఖర్‌ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. మేయర్‌ నీతూకిరణ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. త్వరగా నిందితుడిని పట్టుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Also Read: Rahul Gandhi: కులగణనపై రాహుల్‌గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు

 

 

ఇది కూడా చదవండి: నిమ్మకాయను ఇలా వాడితే అజీర్తి సమస్య ఉండదు

 

Also Read: హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఈసారి ఆ సంస్థతో కలిసి

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG News: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు.

New Update
cm revanth tg

Telangana CM Revanth Reddy lunch in fine rice beneficiary home

TG News: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఉదయం భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి.. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. 

10 లక్షల కొత్త రేషన్‌కార్డులు..

ఇక రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మార్చి 30న ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో వీరు పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో ఏప్రిల్‌ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. అలాగే దాదాపు10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ధనవంతుల లాగే పేదవారు సన్నబియ్యం తినాలని కోరుతున్నారన్నారు. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

2024లో 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదని తెలిపారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

 ration rice | cm revanth | khammam | telugu-news | today telugu today telugu news

 

 

Advertisment
Advertisment
Advertisment