మియాపూర్ మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు

హైదరాబాద్‌లోని మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల నడిగడ్డ తండా ప్రాంతాల్లో చిరుత సంచారిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం చిరుత కోసం గాలిస్తున్నారు.

New Update

హైదరాబాద్‌ నడిబొడ్డున చిరుత పులి సంచారించడం కలకలం రేపింది. నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల నడిగడ్డ తండా ప్రాంతాల్లో చిరుత సంచారంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం చిరుత కోసం గాలిస్తున్నారు. అసలు ఆ చిరుత ఎక్కడి నుంచి వచ్చింది. ఒక్కటే ఉందా దాంతో పాటు ఇంకా చిరుతలు ఉన్నాయా అనేదానిపై ఆందోళన నెలకొంది. 

Also Read: ఫుట్‌పాత్‌ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!

మియాపూర్ మెట్రో స్టేషన్ నిత్యం నగరవాసులతో కిటికిటలాడుతోంది. ఆ ప్రాంత సమీపంలో చిరుతు సంచారిస్తుందన్న విషయం తెలియడంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో అనేక ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో చిరుతలు సంచరిస్తున్న సీసీటీవీ ఫుటెజీలు కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

అన్నమయ్య జిల్లా రామాపురం మండంలోని చిట్లూరు, ఎగువ బండపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో కూడా గురువారం ఓ చిరుత పంట పొలాల్లో సంచరించింది. దీంతో అక్కడి ప్రజల్లో కంటి మీద కునుకు లేకుండా పోయింది. బయటకు మేకలు, ఆవులు, గొర్రెలు, గెదెల్ని తీసుకెళ్లాలన్న కాపర్లు భయపడుతున్నారు. రైతులు కూడా తమ పొలం వద్దకు వెళ్లాలంటనే జంకుతున్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు, ఏన్కూరు మండలాల సరిహద్దు అటవీ ప్రాంతమైన ఎర్రగుట్ట పొలాల్లో కూడా చిరుత సంచారిస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అధికారుల కూడా చిరుత సంచారం నిజమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ చిరుత కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. 

Also Read: మీరెవర్ని చంపినా , ఎంతమందిని చంపినా తగ్గేదే లేదు..హమాస్ సంచలన ప్రకటన

Also Read: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment