TG crime: హైదరాబాద్‌లో విషాదం.. స్నానం చేస్తుండగా లా స్టూడెంట్‌కు గుండెపోటు.. అక్కడికక్కడే..!

రంగారెడ్డి జిల్లా నందిగా సింబయోసిస్ డీమ్డ్ హాస్టల్‌లో విద్యార్థి స్నానం చేస్తుండగా.. గుండెపోటు వచ్చింది. వెంటనే శంషాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడు ఢిల్లీకి చెందిన షాద్‌నిక్ (19)గా పోలీసులు గుర్తించారు.

New Update
heart attack  Law student

Heart Attack Law Student

 TG crime: ఈ మధ్య కాలంలో సడెన్ హార్ట్ ఎటాక్‌లకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారు గుండెపోటు వచ్చేది. కానీ ప్రస్తుత కాలంలో ఆరేళ్ల పసిపిల్లల నుంచి యువత కూడా హార్ట్ ఎటాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అందరితో సరదాగా గడిపినవారు హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. నడుస్తూ.. నవ్వుతూ.. ఆడుతూ.. పాడుతూ.. ఇలా ఎంతో మంది ఆకస్మాత్తుగా చనిపోతున్నారు.  ఇలాంటి అలక మరణంతో వారి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదన్ని నింపుతున్నారు.  తాజాగా లా విద్యార్థి స్నానం చేస్తుండగా.. హార్ట్ ఎటాక్‌కు గురై ప్రాణాలు విడిచాడు.ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. 

గుండెపోటు గురై... లా స్టూడెంట్: 

లా స్టూడెంట్ స్నానం చేస్తుండగా.. హార్ట్ఎటాక్  వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించే లోపే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన  రంగారెడ్డి జిల్లా నందిగా సింబయోసిస్ డీమ్డ్ హాస్టల్‌లో జరిగింది. మృతుడు ఢిల్లీకి చెందిన షాద్‌నిక్ (19)గా గుర్తించారు. సొమవారం ఉదయం కాలేజీకి వెళ్లేందుకు స్నానం చేస్తుండగా..  గుండెపోటు వచ్చింది. గమనించిన కాలేజీ సిబ్బంది వెంటనే శంషాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు  ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ..అప్పటికే  షాద్‌నిక్‌ మృతి చెందినట్లు చెప్పారు. అక్కడి నుంచి షాద్‌నిక్ డెడ్‌బాడీని ఉస్మానియా ప్రభుత్వాస్పత్రికి తలించారు.  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విద్యార్థి మృతి విషయాన్ని పోలీసులు  కుటుంబ సభ్యులకు తెలిపారు. చిన్న వయస్సులోనే గుండెపోట్లతో ప్రాణాలు కోల్పోవటంలో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గంట వ్యాయమం ముఖ్యం:

అయితే.. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా  అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి తగినంత వ్యాయమం లేకపోవటం.. బయట ప్రాసెస్డ్ ఫుడ్, విపరీతమై స్ట్రెస్ వంటివి గుండె జబ్బులకు ముఖ్య కారణాలని చెబుతున్నారు. రోజులో గంటసేపైనా వ్యాయమం, యోగా, నడక వంటి చేయాలి ఇలా చేయటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. పని ఒత్తిడిన తగ్గించుకోవటం శరీరానికి మంచిది. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రొటీన్లు, విటమిన్లు ఉండేలా సమతుల ఆహారం తీసుకుంటూ.. మంచి నిద్ర పోవాలని వైద్యులు అంటున్నారు. కొవిడ్ తర్వాత గుండె జబ్బులు ఎక్కువగా ఉంటున్నాయని.. తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం వలన ప్రమాదం నుంచి బయట పడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: రోజంతా నిద్రపోతున్నారా.. ఈ సమస్యకు కారణం ఇదే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ladies Hostels : అర్థరాత్రి దొంగ హల్ చల్  లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి...

అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్నాడు ఓ దొంగ. అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

New Update
Girls Hostels

Girls Hostels

Ladies Hostels  : అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్న ఓ దొంగ వ్యవహారం మధురానగర్ లో చోటు చేసుకుంది.ఆ దొంగ అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్‌కు చెందిన సింధు(29) నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ.. మధురానగర్‌లోని శ్రీ సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో గత ఐదేళ్ల నుంచి ఉంటుంది. తన బ్యాగులో ల్యాప్‌టాప్, ఏటీఎం కార్డ్, ఆధార్ కార్డ్, మరికొన్ని సర్టిఫికెట్స్‌ను దాచుకుని నిద్రపోయింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో ఓ దొంగ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించాడు. బ్యాగును చోరి చేసి అక్కడి నుంచి ఉడాయించాడు.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

తెల్లారక చూసుకుంటే తన బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఏపీ మంగళగిరికి చెందిన యువతి కె.మనస్వి (24) నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ మధురానగ‌ర్‌లోని రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి హాస్టల్లోని రూమ్‌లో మనస్వి గాఢనిద్రలో ఉన్నప్పుడు ఓ దొంగ జొరబడ్డాడు. ల్యాప్ టాప్, ఛార్జర్, విలువైన వస్తువులను బ్యాగులో దాచుకుంది. మనస్వి నిద్రలోకి జారుకున్నాక ఆమె రూమ్‌లోకి దొంగ జొరబడి బ్యాగును అపహరించి పరారయ్యాడు.రెండు హాస్టళ్లలో చోరి చేసి బ్యాగులతో దొంగ ఉడాయించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఓ లేడీస్ హాస్టల్లో వాచ్‌మెన్ లేకపోవడం.. మరో హాస్టల్లో వాచ్‌మెన్ ఉన్నా అతను నిద్రపోవడంతో దొంగకు అడ్డంకులు లేకుండా పోయాయి. లాభాపేక్షతో హాస్టళ్లను నిర్వహిస్తూ భద్రతను గాలికొదిలేశారని బాధిత యువతులు వాపోయారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లేడీస్ హాస్టల్లో దూరింది దొంగా లేదా ప్రియుడా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఎందుకంటే బయటకొచ్చిన సీసీ ఫుటేజ్‌ను చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. హాస్టల్ లోపలికి వచ్చే డోర్ కాస్తా ఓపెన్ చేసి ఉంది.సాధారణంగా డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. లేదా ఓపెన్ చేసి ఉంటుంది. కానీ హాస్టల్ డోర్ కొంచెం మాత్రం ఓపెన్ అయిన ఉండటం వీడియోలో చూడవచ్చు. అలాగే లోపలికి వచ్చిన వ్యక్తి కూడా తన ఫేస్‌కు ఎలాంటి మాస్క్ ధరించలేదు. సాధారణంగా దొంగతనం చేసే వ్యక్తి, తన ఫేస్ కనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ఇక్కడ అలాంటిది ఏదీ కూడా జరిగినట్టు కనిపించడం లేదు. పైగా అతను గోడ దూకి వెళ్లినప్పుడు అతని దగ్గర ఉన్న బ్యాగ్ కూడా అంత బరువుగా ఉన్నట్టు కనిపించలేదు. దీంతో వచ్చింది అసలు దొంగనే అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఉన్న యువతి కోసం సదరు వ్యక్తి వచ్చి ఉండవచ్చనే అభిప్రాయాన్ని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

 
Advertisment
Advertisment
Advertisment