Lady Aghori: లేడీ అఘోరీపై దాడి.. కరీంనగర్ లో ఉద్రిక్తత!

కరీంనగర్ లో లేడీ అఘోరీపై గుర్తుతెలియని నలుగురు దుండగులు దాడి చేశారు. కరీంనగర్‌ బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా ఆమెపై దాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్సెట్‌పేటలో భక్తురాలి ఇంటికి భిక్షాటనకు బయలుదేరిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

New Update

Lady Aghori: సనాతనధర్మాన్ని కాపాడడానికి ప్రాణత్యాగానికి సిద్ధం అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరీ మళ్ళీ తిరిగొచ్చింది.  నిన్న కరీంనగర్ లో ప్రత్యక్షమైన ఈ లేడీ  అఘోరీ నాగసాధువు  మరో శపథం చేసింది.  ఫిబ్రవరి 3న తాను వేములవాడ వెళ్తున్నానని, అక్కడ దేవాలయంలో ఉన్న దర్గాను కూల్చేవరకు తన పోరాటం ఆగదని సంచలన వ్యాఖ్యలు చేసింది. 

Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్‌ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా

అఘోరీపై దాడి

ఈ క్రమంలో ఈరోజు తనపై నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది అఘోరీ.  కరీంనగర్ బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా తనపై దాడి జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. లక్సెట్‌పేటలో భక్తురాలి ఇంటికి భిక్షాటనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

Also Read : భలే ఛాన్స్ మిస్‌.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!

నేనే కూల్చేస్తా.. 

అయితే నిన్న కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన అఘోరీ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడటంతో తన ప్రాణాలు పోయినా లెక్క చేయనన్నారు. ఈ విషయంపై తన గురువులతో మాట్లాడినట్టు తెలిపింది. మసీదును తానే స్వయంగా కూల్చేస్తానని అన్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని కాపాడటంలో తను ముందుంటానన్నారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే సహించనని తేల్చి చెప్పారు. ఎక్కడైతే అధర్మం తిష్ట వేసుకుంటుందో అక్కడ తను ప్రత్యక్షమవుతానని, అ ధర్మాన్ని అంతం చేసేంతరకు పోరాడుతానని అఘోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: Kurchi Madathapetti: 'కుర్చీ మడతపెట్టి' పాటకు యమ క్రేజ్.. నేపాల్ వీధుల్లో దుమ్మురేపిన అమ్మాయిలు! వీడియో వైరల్

ఇది కూడా చూడండి: Maoist Letter on Encounter: వారంతా సేఫ్.. కాంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Peddapalli : కలెక్టర్ సాబ్ హ్యాట్సాఫ్ ..ప్రభుత్వాసుపత్రిలో భార్య ప్రసవం!

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష భార్య విజయ నిన్న గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రసవించారు. పురిటినొప్పులు రావడంతో వైద్యులు ఆపరేషన్ చేయగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఈ దంపతులపై ప్రశంసలు కురుస్తున్నాయి.

New Update
collector peddapalli

collector peddapalli

ఈ రోజుల్లో ప్రసవం కోసం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లే వాళ్ల సంఖ్య చాలా తక్కువ. ప్రభుత్వాలు స్కీమ్ లు తీసుకొచ్చి ప్రొత్సహించి ప్రభుత్వ ఆసుపత్రులపై భరోసా కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రైవేటుతో పోలిస్తే అక్కడికి వెళ్తున్న వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవలపై మరింత నమ్మకాన్ని కలిగించేలా పెద్దపల్లి జిల్లా కలెక్టర్  శ్రీహర్ష తీసుకున్న నిర్ణయానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి.  

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

నిజంగా అందరికీ ఆదర్శం

ఆయన సతీమణి గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి డెలివరీ చేయించడం నిజంగా అందరికీ ఆదర్శం. ఆయన భార్య విజయ నిన్న గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో ప్రసవించారు. రాత్రి పురిటినొప్పులు రావడంతో వైద్యులు వెంటనే  ఆపరేషన్ చేయగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. తన భార్య గర్భం దాల్చినప్పటి నుంచి కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేయించారు. దీంతో ఈ దంపతులపై నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ గా మారింది. 

కోయ శ్రీ హర్ష ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి, 2017 UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా 6 ర్యాంక్ సాధించారు.  ఆయన NIT జంషెడ్‌పూర్ నుండి ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో B.Tech పట్టా పొందారు. 

Also Read : Chhattisgarh : స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

Also read :  Subham Trailer పెళ్ళాల సీరియల్ పిచ్చికి బలైన మొగుళ్ళు.. సామ్ స్పెషల్ ఎంట్రీ అదుర్స్! ట్రైలర్ చూశారా

peddapalli | Peddapalli Govt Hospital | collector sri Harsha | delivery | telangana 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు