/rtv/media/media_files/2025/02/28/2fUtkT0igbMC2OJOAt6V.jpg)
election road accident Photograph: (election road accident)
ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ నిర్వహించుకొని తిరిగి వస్తున్న బస్సు గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. నిర్మల్ జిల్లాకు చెందిన బైంసా డిపో బస్ TS 09Z 8084 బస్ నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ల సామాగ్రితో పాటు సిబ్బంది కరీంనగర్ వచ్చి వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. ఎలక్షన్ సామాగ్రి కరీంనగర్లో అప్పగించేందుకు వచ్చిన బస్సు అదుపు తప్పి సిబ్బందికి తీవ్ర గాయాలైయ్యాయి.
ఎమ్మెల్సీ ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సుకు రోడ్డు ప్రమాదం.. 20 మందికి గాయాలు
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2025
కరీంనగర్ జిల్లా - గంగాధర ఎక్స్ రోడ్డు వద్ద ఎమ్మెల్సీ ఎలక్షన్ బాక్సులు తీసుకువెళ్తున్న ఎలక్షన్ సిబ్బందికి రోడ్డు ప్రమాదం
నిర్మల్ నుంచి పోలింగ్ సామగ్రి తీసుకువచ్చి తిరిగి వెళ్తుండగా ముందు వెళ్తున్న… pic.twitter.com/jtVdGUuJX2
Also read: rape in Gwalior: ప్రైవేట్ పార్ట్కు 28 కుట్లు.. ఐదేళ్ల బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం
కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై గంగాధర రైల్వే గేటు వద్ద ఈ రోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్ను ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న సుమారు 20 మంది సిబ్బందికి గాయాలైయ్యాయి. వారిని హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also read : AP Budget 2025-26: బడ్జెట్లో లోకేశ్ శాఖకు నిధుల వరద.. ఎన్ని వేల కోట్లంటే..?