Telangana Economic Survey : కుటుంబ నియంత్రణకు అవే బెటర్‌...ఎకానమీ సర్వేలో వెల్లడి

దేశంలో  కేంద్రప్రభుత్వం గతంలో ప్రవేశ పెట్టిన కుటుంబనియంత్రణ పద్ధతులను దక్షిణాది రాష్ట్రాలు విరివిగా ప్రచారం చేశాయి. దాని మూలంగా ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్‌ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఫ్యామిలీ ప్లానింగ్ కోసం కండోమ్ లను ఎక్కువగా వినియోగిస్తున్నారట

New Update
Family planning

Family planning

Telangana Economic Survey :  దేశంలో  కేంద్రప్రభుత్వం గతంలో ప్రవేశ పెట్టిన కుటుంబనియంత్రణ పద్ధతులను దక్షిణాది రాష్ట్రాలు విరివిగా ప్రచారం చేశాయి. దాని మూలంగా ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్‌ అయింది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన  నేషనల్ హెల్త్ సెమినార్ సదస్సులో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కంట్రోల్, ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలపై ప్రశంసలు లభించినట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే చాలామంది కుటుంబ నియంత్రణ కోసం ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ సర్జరీల కంటే కండోమ్ లు వినియోగించడానికే ఆసక్తి చూపుతున్నారని వెల్లడైంది. ఈ విషయాలన్నింటిని ప్రభుత్వం 2024–2025 సోషియో ఎకానమీ బుక్ లెట్ లో పొందుపరిచింది.

Also Read: Delhi Railway station :  ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన  ఢిల్లీ రైల్వే స్టేషన్‌!

రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ పద్ధతులపై వైద్యారోగ్యశాఖ అధికారులు​ ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. వారంలో ఒక రోజు ప్రాథమిక ఆరోగ్య స్థాయి కేంద్రం పరిధిలోని జంటలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎంత మంది పిల్లల్ని కనాలి? ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి? ఫస్ట్ బేబీ నుంచి సెకండ్ బేబీ గ్యాప్ ఎంత ఉండాలి? పునరుత్పత్తి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల పరిధిలోని ఎమ్ ఎల్ హెచ్ పీలు, ఆశాలు, ఏఎన్ ఎంలు చొరవ తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 వేల మంది ఏఎన్ ఎంలు, 37 వేల మంది ఆశా వర్కర్లు కుటుంబ నియంత్రణపై సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సమర్ధవంతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవాలనుకునే జంటలకు మెడికల్ ఆఫీసర్ స్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. రెండు మూడు దఫాల చర్చల అనంతరం, కుటుంబ సభ్యుల సమ్మతంతో ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ సర్జరీలు నిర్వహిస్తున్నారు. అయితే కుటుంబ నియంత్రణ కోసం ఎక్కువ మంది కండోమ్‌లు వినియోగిస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన సోషియో ఎకానమీ సర్వేలో  వెల్లడైంది. ఫ్యామిలీ ప్లానింగ్ లో భాగంగా 1,35,713 మంది కండోమ్ లు వినియోగిస్తున్నట్లు సోషియో ఎకానమీ సర్వేలో పేర్కొన్నారు. ఇక 1,10,016 మంది పిల్స్ వినియోగించారు. అంతేగాక మరో 13,676 మంది అంత్రా ఇంజక్షన్స్ వాడగా, 67,464 మంది మహిళలు ట్యూబెక్టమీ, 1006 మంది పురుషులకు వ్యాసెక్టమీ స్టెరిలైజేషన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు.  రాష్ట్రంలో అమలు చేస్తున్న పాలసీలు, నిర్ణయాలు వలన టోటల్ ఫెర్టిలిటి రేట్(టీఎఫ్​ఆర్ తగ్గినట్లు సోషియో ఎకనామీ సర్వేలో వెల్లడించారు. ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంత మంది పిల్లల్ని కంటున్నారనేది టీఎఫ్​ఆర్ లో లెక్కిస్తారు. జాతీయ స్థాయిలో టీఎఫ్​ఆర్ 2.0 ఉండగా, తెలంగాణ లో 1.5 ఉన్నట్లు శాంపిల్ రీసెర్చ్ సర్వే 2020 రిపోర్టు ప్రకారం వెల్లడించారు. 

Also Read: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

Also Read: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment