Human Trafficking: సినిమా అవకాశాల పేరుతో గాలం...వ్యభిచార రొంపిలోకి దింపి...

Human trafficking : హైదరాబాద్ నగరానికి బతుకుతెరువు కోసం వచ్చే యువతులను కొంతమంది మహిళలు వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. సినిమా అవకాశాల కోసం నగరానికి వచ్చే యువతులను ఫిలిం కాస్టింగ్ మేనేజర్ నంటు అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆకర్షించింది నాగమణి అనే మహిళ.

New Update
 Human trafficking

Human trafficking

హైదరాబాద్ నగరానికి బతుకుతెరువు కోసం వచ్చే యువతులను కొంతమంది మహిళలు వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. ఉద్యోగాలు, సినిమా అవకాశాల కోసం నగరానికి వచ్చేవారికి ఫిలిం కాస్టింగ్ మేనేజర్ నంటు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతలను ఆకర్షించింది నాగమణి అనే మహిళ. యువతులను ఆకర్షించి విటుల వద్దకు పంపుతూ దారుణాలకు ఒడిగట్టింది. విశ్వసనీయ సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు, సరూర్ నగర్ పోలీసులు నాగమణినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

 Also Read: CM Chandrababu: కేసీఆర్, జగన్‌కు భిన్నంగా చంద్రబాబు ధోరణి.. సక్సెస్ సీక్రెట్ అదే అంటున్న విశ్లేషకులు!

డాకయిట్ ఆపరేషన్ ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు,సరూర్ నగర పోలీసులు నాగమణిని దిల్ షుఖ్ నగర్, కమల నగర్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. యువతుల ఫోటోలను వాట్సప్ ద్వారా విటులకు పంపించి.. వాళ్లకి నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తుంది. తర్వాత లొకేషన్ కన్ఫర్మేషన్ తర్వాత స్వయంగా నాగమణి విటుల వద్దకు తీసుకెళ్తోంది. అవకాశాల పేరుతో యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతోంది. ఉపాధి కోసం వచ్చి బలవుతున్న యువతులు, మహిళలు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మహిళలకు పోలీసులు సూచిస్తున్నారు.

Also Read: Goa University: గోవా యూనివర్సిటీలో ఘోరం.. గర్ల్ ఫ్రెండ్ కోసం పేపర్ లీక్ చేసిన ప్రొఫెసర్: ట్విస్ట్ అదిరింది!

Human Trafficking

సినిమా అవకాశాల పేరుతో యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న నాగరాణి అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఫిలిం కాస్టింగ్ మేనేజర్  నంటు ఆమె మోసాలకు పాల్పడుతోంది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఎర వేసి సినిమాల పేరుతో యువతులను ఆకర్షించి విటుల వద్దకు పంపుతోంది.యువతుల ఫోటోలను వాట్సాప్ ద్వారా విటులకు నాగరాణి పంపుతుంది. దాంతో వారు అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటుంది. డబ్బులు వచ్చాక.. లొకేషన్ కన్ఫర్మేషన్ చేస్తున్న తర్వాత నాగరాణి యువతలను స్వయంగా విటులవద్దకు తీసుకువెళుతుంది.

Also Read:  USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు

విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వలపన్ని నాగరాణినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె కోసం హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు , సరూర్ నగర్ పోలీసులు  డాకాయిట్ ఆపరేషన్ నిర్వహించారు. హలో నాగమణి అంటూ వాట్సాప్‌లో  విటుల వలే పోలీసులు మెసేజ్‌ చేయడంతో ఆమె దిల్‌సుఖ్‌నగర్‌ కు అమ్మాయిని తీసుకొని వచ్చింది.  సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి బృందం, ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌ బృందం డెకాయిట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. అమ్మాయి కావాలని వాట్సప్‌ ద్వారా నాగమణిని సంప్రదించారు. ఆమె ఓ యువతితో దిల్‌సుఖ్‌నగర్‌ కమలానగర్‌కు వచ్చి వారితో బేరసారాలు సాగించింది. దీంతో నాగమణితో పాటు మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు. సరూర్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

 సినిమా అవకాశాలు, ఉద్యోగాల పేరుతో మోసాలకు గురికావద్దని, నాగమణి లాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి యువతులకు సూచించారు.అమీర్‌పేటకు చెందిన నాగమణి సినిమా అవకాశాల పేరుతో యువతులను వ్యభిచారంలోకి దింపుతుందని పోలీసులు నిర్ధారించారు. సినిమాల పేరుతో  బలవుతున్న యువతులు, మహిళలు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: గురుకులాల్లో కోడింగ్‌ శిక్షణ.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు !

తెలంగాణవ్యాప్తంగా గురుకులాల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు కోడింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. మంగళవారం సెక్రటరీ అలుగు వర్షిణి ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ విద్యా సంవత్సరం నుంచే 238 గురుకుల పాఠశాలల్లో దీన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

New Update
TGSWREIS

TGSWREIS

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు కోడింగ్‌పై శిక్షణ ఇవ్వనుంది. మంగళవారం సెక్రటరీ అలుగు వర్షిణి ఈ విషయాన్ని వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులకు ఇందుకు మినహాయిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 238 గురుకుల పాఠశాలల్లో కోడింగ్‌ కోర్సుపై శిక్షణ ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. 

గతేడాది మొయినాబాద్‌ గురుకుల పాఠశాలలో మాత్రమే కోడింగ్‌పై శిక్షణ ఇచ్చామని.. ఇప్పుడు అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నామని తెలిపారు. అయితే ఈ శిక్షణ కోసం గురుకుల సంస్థ యూకేలోని లండన్‌కు చెందిన ర్యాస్ప్ బెర్రీపై పౌండేషన్ (RBF) తో ఐదేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు కావాల్సిన స్కిల్స్, కరిక్యులమ్. మానిటరింగ్, టీచింగ్, యాక్షన్ ప్లాన్ వంటి వివిధ అంశాల్లో ఫౌండేషన్ నిర్వహకులు పాలు పంచుకోనున్నారు. 

Also read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఆన్‌లైన్ టూల్స్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించేందుకు అంతా సిద్ధం చేశారు. గురుకుల సంస్థ ఈ కోడింగ్‌ శిక్షనను పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రతి పాఠశాలలో ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా అమలు చేసింది. దీని ఫలితాలు మెరుగ్గా రావడంతో ఫౌండేషన్ ప్రతినిధులను గురుకుల అధికారులు ఒప్పించారు. అలాగే అన్ని పాఠశాలల్లో కంప్యూటింగ్ పాఠ్యాంశాలను రెగ్యులర్‌ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. 

Also Read: బయటపడిన ఫేక్ డాక్టర్.. ఒకే నెలలో ఎంతమంది మృతి చెందారంటే?

గురుకులాల్లో కోడింగ్ శిక్షణలో భాగంగా విద్యార్థులకు 2 గంటల పాటు బోధిస్తారు. మరో రెండు గంటలు ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయిస్తారు. దాదాపు 1.52 లక్షల మంది విద్యార్థులకు కంప్యూటింగ్ పాఠ్యాంశాలను ఒక సబ్జెక్టుగా నేర్పించి పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు జారీ చేస్తారు. అయితే గురుకులాల్లో విద్యార్థులకు కోడింగ్ టెక్నాలజీని నేర్పించడం చరిత్రలో ఇదే మొదటిసారని.. ఇదొక మైలురాయిగ నిలుస్తుందని సెక్రటరీ అలుగు వర్షిణి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కోడింగ్‌ శిక్షణ, బోధన కోసం స్కూల్స్‌లో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌లను కూడా తీసుకొస్తామని చెప్పారు.  

Advertisment
Advertisment
Advertisment