Hyd: శంషాబాద్ సరికొత్త రికార్డ్..దేశంలో అగ్రస్థానం

హైదరాబాద్ లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుంది.  ప్రయాణికుల రాకపోకల్లో గత ఆర్ధిక సంవత్సరం 15.20 శాతం వృద్ధి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.  లాస్ట్ మూడు నెల్లోనే 74 లక్షల మంది ప్రయాణించడం విశేషం

New Update
hyd

Samshabad Rajiv Gandhi Air port

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ఇప్పటికే ఎన్నో రికార్డును కొల్లగొట్టింది. ఇప్పుడు తాజాగా మరో కొత్త రికార్డ్ ను సృష్టించి దేశంలోని విమానాశ్రయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రయాణికుల రాకపోకల్లో 15.20 శాతం వృద్ధి సాధించి న్యూ రికార్డ్ నెలకొల్పింది.  లాస్ట్ ఇయర్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించారు. చివరి మూడు నెల్లో అయితే ఏకంగా 74 లక్షల మంది ప్రయాణం చేశారు. ఇది మరో రికార్డ్.  ఈ రద్దీ ఇలానే కొనసాగితే వచ్చే ఏడాదికి ఈ సంఖ్య మూడు కోట్లు దాటుతుందని ఎయిర్ పోర్ట్ అథారిటీ చెబుతోంది. ఇక్కడి నుంచి నెలకు ప్రయాణించే వారి సంఖ్య గరిష్ఠంగా 20 లక్షలే కాగా.. ఈ మూడు నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించడం విశేషమని అధికారులు గర్వంగా చెబుతున్నారు.  ఈ విషయంలో కోలకత్తా, చెన్నై, బెంగళూరులను హైదారబాద్ దాటేసింది. అలాగే రోజువారీ గరిష్ట సంఖ్య 75 వేలను కూడా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ జనవరి 18న అధిగమించింది. ఈ ఒక్క రోజే 94 వేలమంది ప్రయాణించారని తెలిపారు. 

డొమస్టిక్, అంతర్జాతీయం అన్నీ..

హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్ళే వారి సంఖ్యా ఎక్కువగానే ఉంటోంది. ఇక్కడి నుంచి దుబాయ్, దోహా, అబుదాబి సహా అమెరికా వంటి విదేశాలకు వెళ్ళేవారు ఎక్కువగానే ఉంటున్నారు. దుబాయ్ కు నెలకు 93 వేల మంది, దోహాకు 42 వేల మంది, అబుధాబీకి 38 వేలు, జెడ్డాకు 31 వేలు, సింగపూర్‌కు 31 వేల మంది ప్రయాణిస్తున్నారని విమానాశ్రయ అధికారులు లెక్కలు చెబుతున్నారు. తెలంగాణ నుంచే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు కూడా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచే విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు. దాంతో పాటూ హైదరాబాద్‌లో తరచూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరుగుతుండటం వలన కూడా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. 

today-latest-news-in-telugu | air-port | samshabad | rajiv-gandhi-airport

Also Read: AP: కియా ప్లాంట్ నుంచి 900 ఇంజిన్లు దొంగతనం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime : ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో మహిళ. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ప్రవీణ్‌, ప్రమీల భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. గత కొంత కాలంగా ప్రమీల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ప్రియుడితో కలిసి ప్రవీణ్‌కు ఉరివేసి హత్య చేసింది.

New Update
rangardddy affiar

rangardddy affiar

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను ఉరివేసి చంపిదో భార్య. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..  దన్నారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌, ప్రమీల దంపతలకు ఇద్దరు సంతానం. అయితే ప్రమీల మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది భర్త ప్రవీణ్ కు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భర్తను చంపేసి ప్రియుడితో కలిసి సుఖంగా ఉండాలని ప్రమీల స్కెచ్ వేసింది.  

Also Read: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Also Read :  Pakistan కి ముందు నుయ్యి వెనక గొయ్యి.. 3 ముక్కలవ్వనున్న పాక్ దేశం!

ప్రియుడిని ఇంటికి పిలిచి

ప్లాన్ లో భాగంగా..  శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన ప్రియుడిని ఇంటికి పిలిచిన ప్రమీల..  ప్రవీణ్‌కు ఉరివేసి హత్య చేసింది. కుటుంబసభ్యులకు,బంధువులకు తన భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది. అయితే అనుమానం వచ్చిన ప్రవీణ్‌ తల్లిదండ్రులు, గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వెంటనే  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమీలను అదుపులోకి తీసుకుని విచారించగా..  ఆమె అసలు విషయాన్ని ఒప్పుకుంది. ప్రమీల పాటుగా ఆమె ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Also Read: ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర్‌ యాత్ర.. కేంద్ర విదేశాంగ మంత్రి కీలక ప్రకటన

Also Read :  ఏం మనిషివిరా.. కడుపుతో ఉన్న భార్యకు కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలిపి

 

ranga-reddy | wife | husband | lover

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు