అటకెక్కిన మెట్రో కోచ్‌ల పెంపు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు!

హైదరాబాద్‌ మెట్రో కోచ్ ల పెంపు కలగానే మిగిలింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా గతేడాది మరో 3 కోచ్ లు పెంచుతామని చెప్పి, ఇప్పుడు అసాధ్యం అంటూ మెట్రో యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

author-image
By srinivas
New Update
Telangana: ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లు..!

HYD Metro: హైదరాబాద్‌ మెట్రో కోచ్ ల పెంపు అటకెక్కింది. ప్రయాణికులు రద్దీకి అనుగుణంగా ఒక్కో రైలుకు 3 కోచ్‌ల నుంచి 6 కోచ్‌లకు పెంచేందుకు ఏడాది క్రితమే ప్రణాళిక రూపొందించినప్పటికీ ఇంతవరకూ ఉలుకు పలుకు లేకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్‌ మెట్రో నుంచి కోచ్‌లను తెప్పిస్తామని చెప్పినప్పటికీ ఇందులో ఎలాంటి పురోగతి లేకపోవడంపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతిరోజు సుమారు 5 లక్షల మంది..

ప్రస్తుతం రాయదుర్గం–నాగోల్, మియాపూర్‌–ఎల్‌బీనగర్‌, జేబీఎస్-ఎంజీబీఎస్ ఈ మూడు కారిడార్లలో 59 మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఇవి రోజు 1,065 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతిరోజు సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తుండగా.. సెలవు దినాల్లో రద్దీ కారణంగా దాదాపు 5.10 లక్షల వరకు ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక 2017 మెట్రోరైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 4 కోట్ల మంది వినియోగించుకున్నారని, అందుకు అనుగుణంగానే ట్రిప్పులు పెంచినట్లు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: Trump-Modi: ఓ మై ఫ్రెండ్‌...అంటూ ట్రంప్‌ కి శుభాకాంక్షలు తెలిపిన మోదీ!

ప్రయాణికుల పడిగాపులు..


కానీ కోచ్‌ల కొరత వల్ల ఎన్ని ట్రిప్పులు తిరిగినా ప్రయాణికుల రద్దీ తగ్గటంలేదు. రోజు 1.20 లక్షల మంది విద్యార్థులు, 1.40 లక్షలకుపైగా సాఫ్ట్‌వేర్‌, ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్లు నడుస్తున్నా ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు సకాలంలో ఆఫీసులకు చేరలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కోచ్ లను పెంచి తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. 

ఇది కూడా చదవండి: America Precident: మరోసారి అగ్రరాజ్యాధినేతగా ట్రంప్‌ 2.o!

ఇదిలా ఉంటే.. మెట్రోకు భారీగా నష్టాలొస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కొత్త కోచ్‌ల కొనుగోలుకు సుమారు రూ.10 కోట్ల ఖర్చు అవుతుందని, 59 రైళ్లకు 3 చొప్పున కొంటే రూ.500 కోట్లు కావాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యం అంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ladies Hostels : అర్థరాత్రి దొంగ హల్ చల్  లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి...

అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్నాడు ఓ దొంగ. అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

New Update
Girls Hostels

Girls Hostels

Ladies Hostels  : అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్న ఓ దొంగ వ్యవహారం మధురానగర్ లో చోటు చేసుకుంది.ఆ దొంగ అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్‌కు చెందిన సింధు(29) నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ.. మధురానగర్‌లోని శ్రీ సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో గత ఐదేళ్ల నుంచి ఉంటుంది. తన బ్యాగులో ల్యాప్‌టాప్, ఏటీఎం కార్డ్, ఆధార్ కార్డ్, మరికొన్ని సర్టిఫికెట్స్‌ను దాచుకుని నిద్రపోయింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో ఓ దొంగ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించాడు. బ్యాగును చోరి చేసి అక్కడి నుంచి ఉడాయించాడు.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

తెల్లారక చూసుకుంటే తన బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఏపీ మంగళగిరికి చెందిన యువతి కె.మనస్వి (24) నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ మధురానగ‌ర్‌లోని రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి హాస్టల్లోని రూమ్‌లో మనస్వి గాఢనిద్రలో ఉన్నప్పుడు ఓ దొంగ జొరబడ్డాడు. ల్యాప్ టాప్, ఛార్జర్, విలువైన వస్తువులను బ్యాగులో దాచుకుంది. మనస్వి నిద్రలోకి జారుకున్నాక ఆమె రూమ్‌లోకి దొంగ జొరబడి బ్యాగును అపహరించి పరారయ్యాడు.రెండు హాస్టళ్లలో చోరి చేసి బ్యాగులతో దొంగ ఉడాయించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఓ లేడీస్ హాస్టల్లో వాచ్‌మెన్ లేకపోవడం.. మరో హాస్టల్లో వాచ్‌మెన్ ఉన్నా అతను నిద్రపోవడంతో దొంగకు అడ్డంకులు లేకుండా పోయాయి. లాభాపేక్షతో హాస్టళ్లను నిర్వహిస్తూ భద్రతను గాలికొదిలేశారని బాధిత యువతులు వాపోయారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లేడీస్ హాస్టల్లో దూరింది దొంగా లేదా ప్రియుడా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఎందుకంటే బయటకొచ్చిన సీసీ ఫుటేజ్‌ను చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. హాస్టల్ లోపలికి వచ్చే డోర్ కాస్తా ఓపెన్ చేసి ఉంది.సాధారణంగా డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. లేదా ఓపెన్ చేసి ఉంటుంది. కానీ హాస్టల్ డోర్ కొంచెం మాత్రం ఓపెన్ అయిన ఉండటం వీడియోలో చూడవచ్చు. అలాగే లోపలికి వచ్చిన వ్యక్తి కూడా తన ఫేస్‌కు ఎలాంటి మాస్క్ ధరించలేదు. సాధారణంగా దొంగతనం చేసే వ్యక్తి, తన ఫేస్ కనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ఇక్కడ అలాంటిది ఏదీ కూడా జరిగినట్టు కనిపించడం లేదు. పైగా అతను గోడ దూకి వెళ్లినప్పుడు అతని దగ్గర ఉన్న బ్యాగ్ కూడా అంత బరువుగా ఉన్నట్టు కనిపించలేదు. దీంతో వచ్చింది అసలు దొంగనే అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఉన్న యువతి కోసం సదరు వ్యక్తి వచ్చి ఉండవచ్చనే అభిప్రాయాన్ని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

 
Advertisment
Advertisment
Advertisment