Hyderabad లో ఘోరం.. చిన్నారి ప్రాణాలు మింగేసిన హాట్ వాటర్ బ్యాగ్ !

అల్వాల్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హాట్ వాటర్ బ్యాగ్ పగిలి.. ఆ వేడి నీరు పడడంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు విడిచాడు. చిన్నారి పై నీళ్లు పడిన వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.

New Update
hot water bag1

hot water bag1

Hyderabad : ఆరోజు రాత్రి 8 గంటల సమయం కావొస్తుంది. అప్పుడే నాన్నకు తీవ్రమైన నడుము నొప్పి మొదలైంది. దీంతో నాన్న కాస్త ఉపశమనం కోసం బ్యాక్ పై హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకొని పడుకున్నాడు. కానీ అదే వాటర్ బ్యాగ్ తన కొడుకును బలి తీసుకుంటుందని ఊహించలేకపోయాడు. అవును.. మీరు విన్నది నిజమే ..! హాట్ వాటర్ బ్యాగ్ పేలి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విధారకమైన ఘటన హైదరాబాద్ లోని అల్వాల్‌ పరిధిలో చోటుచేసుకుంది.  

Also Read :  ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!

హాట్ వాటర్ బ్యాగ్ పేలడంతో.. 

 మచ్చబొల్లారం గోపాల్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఆనంద్‌ అనే ఓ  ప్రైవేటు ఉధ్యోగికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అతని పేరు దేవాన్ష్. అయితే కొన్నేళ్లుగా బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న ఆనంద్ కి వైద్యులు హాట్ వాటర్ బ్యాక్ చికిత్స సూచించారు. కాగా, ఈనెల 8న ఆనంద్ కి బ్యాక్ పెయిన్ రావడంతో హాట్ వాటర్ బ్యాక్ వీపు పై పెట్టుకొని బోర్లా పడుకున్నాడు. ఆ సమయంలో ఆడుతూ అక్కడికి వచ్చిన దేవాన్ష్ నాన్న అంటూ.. తండ్రి పై దూకాడు. ఈ క్రమంలో నేరుగా దేవాన్ష్ హాట్ వాటర్ బ్యాగ్ పై బలంగా పడడంతో అది పగిలిపోయింది. దీంతో దానిలోని వేడి నీళ్లు దేవాన్ష్ పై పడడంతో ఆ చిన్నారికి తీవ్ర గాయలయ్యాయి. వెంటనే స్థానిక అస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ దేవాన్ష్ మృతి చెందాడు.    

Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...

ఇంట్లో తరచూ వాడే వాటర్ హీటర్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. అవే మీ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిలిస్తాయి.

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన మాస్ కా దాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు!

తెలంగాణ టెన్త్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. గ్రేడింగ్‌ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసింది. దీంతో మెమోల ముద్రణ ఎలా ఉండాలనే దానిపై స్పష్టత రావట్లేదట. అది తేలితేనే ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. 

New Update
tg 10th

TG 10th Results: తెలంగాణ టెన్త్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. గ్రేడింగ్‌ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసింది. దీంతో మెమోల ముద్రణ ఎలా ఉండాలనే దానిపై స్పష్టత రావట్లేదట. అది తేలితేనే ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. 

రేవంత్ సర్కార్ GO జారీ..

ఈ మేరకు గత ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన గ్రేడింగ్‌ విధానానికి స్వస్తి చెప్పి మార్కులు ఇవ్వాలని రేవంత్ సర్కార్ GO జారీ చేసింది. అయితే మార్కులకు సంబంధించిన మెమోల ముద్రణపై ఇప్పటికే మంతనాలు జరపగా దీనిపై తుది నిర్ణయం వెలువడలేదట. దీంతో మెమోల జారీ అశం తేలితేనే రిజల్ట్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం కూడా  పూర్తి కాగా.. ఏప్రిల్ చివరి వారం వరకు ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారట. ఈ లోగా ప్రభుత్వం నుంచి మెమోలా అంశంపై స్పష్టమైన ప్రకటన రాకపోతే మరింత ఆలస్యం అవుతుందని, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. 

NCERT ప్రతిపాదన..

ఇదిలా ఉంటే.. గతంలో మోమోలపై ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి, ఫెయిల్‌ అని రాసేవారు. కానీ ఇప్పుడు పాస్, ఫెయిల్‌ అని ఇస్తే చాలని NCERT సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ప్రథమ మార్కులు సాధించినవారిని ప్రోత్సహించేలా ఫస్ట్, సెకండ్, థర్డ్‌ క్లాస్‌ అని ఇవ్వాలని, 35 మార్కుల కన్నా తగ్గితే ఫెయిల్‌ అని రాయాలని ప్రభుత్వానికి ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు ప్రతిపాదించారట. దీనిపై నెల గడుస్తున్నా ప్రభుత్వం జవాబు ఇవ్వకపోవడతో NCERT అధికారులు సచివాలయానికి వెళ్లి విద్యాశాఖ అధికారులను ఆరా తీసినట్లు సమాచారం. 

Also read :  Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

మరోవైపు గ్రేడింగ్‌ విధానమే కొనసాగించాలని డిమాండ్ వినిపిస్తున్నాయి. మార్కులు ప్రవేశపెడితే ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తామని ట్రస్మా తరఫున వినతిపత్రాలు అందినట్లు యాదగిరి శేఖర్‌రావు తెలపడం చర్చనీయాంశమైంది. కానీ 10వ  తరగతి గ్రేడింగ్‌ విధానం 2024 నవంబరులోనే ప్రభుత్వం ఎత్తివేసింది. ఇంటర్నల్ 20 మార్కులు ఉంటాయని తెలిపింది. కానీ ఇంటర్నల్ మార్క్స్ తొలగిస్తే ఫలితాల్లో మార్కులు తగ్గే అవకాశం ఉందని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. 

Also read :  TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

10th-class-results | telangana | memo | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment