CM Revanth reddy : ఉగాది పచ్చడి షడ్రుచుల్లా తెలంగాణ బడ్జెట్

హైదరాబద్ రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈఏడాది బడ్జెట్ ఉగాది పచ్చడి షడ్రుచుల్లా ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సరం సంతోషాలను అందించాలని ఆకాంక్షించారు.

New Update

హైదరాబద్ రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సరం సంతోషాలను అందించాలని కోరుకున్నారు. రాబోయే ఏడాది సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ లభించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆర్థిక శాఖమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితమని ముఖ్యమంత్రి చెప్పారు.  వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చామని, విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నిటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించామని గుర్తు చేశారు.

Also read: తెలంగాణలోని వృద్ధులకు సర్కార్ ఉగాది కనుక..  ఏప్రిల్ నుంచి రూ.5 లక్షల బెనిఫిట్!

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రైజింగ్ అంటూ.. దేశంలో తెలంగాణ ఒక వెలుగు వెలగాలని ఆయన అన్నారు. తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతో  దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలని అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఫ్యూచర్ సిటీ పెట్టుబడుల నగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేదే మా ప్రభుత్వం విధానమని వివరించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఈరోజు రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ  చేయనున్న విషయం తెలిసిందే. రవీంద్ర భారతిలో కార్యక్రమం అనంతరం నేరుగా ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌లో హుజూర్‌నగర్ బయలుదేరారు.

Also read: BIG BREAKING: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. రేవంత్ టీంలోకి మరో నలుగురు..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

LRS Concession Offer: గుడ్‌న్యూస్‌.... ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు మరో నెల పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) రాయితీ గడువును పొడిగించింది. ఏప్రిల్ 30వరకు అవకాశం కల్పించింది. గత నాలుగేళ్లుగాపెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

New Update
LRS registration

LRS registration Photograph: (LRS registration)

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) రాయితీ గడువును పొడిగించింది. ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించింది. గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. మొదట మార్చి 31వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఆ లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం మేర రాయితీ ప్రకటించారు. అయితే ఈ గడువు ముగిసింది. కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

LRS Concession Offer

అయితే రాయితీపై ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినా ఆశించినంత మేర రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రజల నుంచి ప్రభుత్వం అనుకున్న మేర స్పందన కూడా రాలేదు. దీనిలో భాగంగానే.. మరో సారి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు గడువును పొడిగించింది. ఇప్పటి వరకు 4 లక్షల మంది దరఖాస్తుదారులు రూ.1200 కోట్ల వరకు ఫీజు చెల్లించారు. పథకం అమలు తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఎదురయ్యాయి. దీనిని అధికారులు పరష్కరించేలోపే గడువు తేదీ సమీపించింది. దీంతో పాటు వరుసగా ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో చివరి రెండు రోజులు కార్యకలాపాలు సాగలేదు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తడంతో.. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఓటీఎస్‌ను మరో నెల రోజులు పొడిగించింది.

Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!

2024-25 ఆర్థిక సంవత్సరం చివరి రోజున అంటే మార్చి 31న 43,700 మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఫీజు చెల్లించారు. ఆ ఒక్క రోజే ఫీజు కింద దాదాపు రూ.124 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు అధికారాలు తెలిపారు. అయితే ఈ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోగా.. ఏప్రిల్ 1వ తేదీన కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ కింద ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీని వర్తింపజేశారు.

ఇది కూడా చదవండి: చర్మం, జుట్టును రక్షించే అద్భుతమైన ఆయుర్వేద ఉత్పత్తులు

Also Read :  పరికిణీలో నభా అందాల జాతర.. చూస్తే ఫ్లాటే

 

lrs-telangana | LRS Discount | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates

Advertisment
Advertisment
Advertisment