HYD:హైదరాబాద్ లో ఇళ్లు ఉన్న వారికి అలర్ట్.. అలా చేస్తే క్రిమినల్ కేసే!

అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్‌ తీసుకుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ హెచ్చరించింది. శంషాబాద్‌ కుమ్మరి బస్తీలో పర్మిషన్ లేకుండా రెండు నల్లాలు, మోటార్లు వాడుతున్న ఏడుగురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు ఫైల్ చేశారు. 

New Update
erere

Hyderabad : హైదరాబాద్ లో ఇళ్లు ఉన్న వారికి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ కీలక సూచన చేసింది. జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్‌ తీసుకుంటే క్రిమినల్ కేసులు పెడుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగతనంగా నల్లా కలెక్షన్ తీసిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహ్మద్‌ అర్షద్‌ అలీ తెలిపారు.

Also Read :  జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బంపరాఫర్!

Also Read :  సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి

ఏడుగురిపై క్రిమినల్ కేసు.. 

శంషాబాద్‌ లోని కుమ్మరి బస్తీకి చెందిన బి.రవి, బి.కృష్ణ, బి.కుమార్‌, బి.అంజయ్య, మహబూబ్‌ బీ, కె.బాల్‌రాజ్‌, టి.భాస్కర్‌లు మిషన్‌ భగీరథ రెండు నల్లాలతో పాటు బోరు మోటర్లతో నీళ్లను అక్రమంగా వాడుకుంటున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టారు. అకస్మిక తనిఖీలు నిర్వహించిన హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ అధికారులు.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహ్మద్ తెలిపారు. 
వారినుంచి నీటి సరఫరా చేసేందుకు ఉపయోగిస్తున్న ఎలక్ట్రికల్‌ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు.

Also Read :  బ్లాక్ బాడీకాన్ అవుట్ ఫిట్ లో..చేతిలో అది పట్టుకొని తమన్నా హాట్ ఫోజులు

ఇక ఆ ఏడుగురిపై పీడీపీపీఏ చట్టం సెక్షన్‌ 3, భారతీయ న్యాయ సంహిత 326(ఏ) 303 (2) సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు ఫైల్ చేశారు. జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజీ పైపులైన్‌ కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా, సీవరేజీ కనెక్షన్లు గుర్తిస్తే జలమండలి విజిలెన్స్‌ బృందానికి 99899 98100, 99899 87135 ఫోన్‌ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. 

Also Read :  సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HYD: హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..

హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్లో ప్రాంతాల్లో ఇవి జరిగాయి. 

New Update
ed

హైదరాబాద్ లో సురానా ఇండస్ట్రీస్, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈ డీ అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ కంపెనీల ఛైర్మన్ నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళల్లో, ఆఫీస్ుల్లో తనిఖీలు నిర్వహించింది. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నారన్న అనుమానంతోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. నాలుగు గంటలకి ఈడీ దాడులు చేశారు. మొత్తం రెండు టీములతో ఈడీ సోదాలు చేసింది. బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఈడి అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక ఈడి బృందాలు నాలుగు ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహిస్తున్నాయి.

రుణాలు ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు..

సురానా గ్రూపు చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను పొందింది. కానీ వాటిని చెల్లించకుండా రుణాలను ఎగ్గొట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాంతో పాటూ మనీలాండరింగ్తో పాటు విదేశాలు డబ్బులు తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఇంతకు ముందు సురానా గ్రూప్స్ పై సీబీఐ కేసు కూడా నమోదైంది. ఈ కారణంగానే సురానా అనుబంధ సంస్థ అయిన సాయి సూర్య డెవలప్ మెంట్స్ కంపెనీ  ఆఫీసుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సంస్థల ఆర్థిక లావాదేవీలు, అప్పులు లాంటి వాటిపై ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.

 today-latest-news-in-telugu | ed | hyderabad | raids 

Also Read: AP: విశాఖలో టీసీఎస్ భారీ క్యాంపస్..99పైసలకే భూమి లీజు

Advertisment
Advertisment
Advertisment