/rtv/media/media_files/2025/04/06/UdsT2KTqqNHFN5xNA30s.jpg)
Fake Baba
Fake Baba : మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేవో తెలియదు కానీ, మంత్రగాళ్లకు మాత్రం కాసుల భాగానే రాలుతున్నాయి. పేక్ బాబాలు, స్వామిజీలను నమ్మి చదువుకున్నవారు సైతం మోసపోతున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పేక్ గాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ ఫేక్ స్వామిని నమ్మిన మహిళ లెక్చరర్ రూ.20 లక్షలు పోగొట్టుకున్నారు.
Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి
ఈజీ మనీకి అలవాటుపడి ఫేక్ బాబులు, స్వామిజీల రూపంలో ప్రజల్ని దోచుకుంటున్నారు. జాతకాలు, విశ్వాసాలను ఆసరాగా చేసుకొని అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రజలు కూడా వారిని గుడ్డిగా నమ్మి నట్టేట మునుగుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలో ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటి దిష్టి పోగొట్టుతానంటూ ఓ ఫేక్ స్వామిజీని ఓ అధ్యాపకురాలిని మోసం చేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 20 లక్షలతో ఊడాయించాడు. కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also read: Husband suicide: కాజల్ వేధింపులు.. భరించలేక భర్త లైవ్ వీడియో చేసి సూసైడ్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన ఓ మహిళ దిల్సుఖ్నగర్లోని జూనియర్ కళాశాలలో లెక్చరర్గా విధులు నిర్వహిస్తుంది. భర్త చనిపోవడం, కుటుంబ పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో తరుచూ ప్రిన్సిపల్ తో చెప్పుకుని బాధపడేది. అయితే ఆమె బాధవిన్న ఆయన ఓ ఉచిత సలహ ఇచ్చాడు. దీంతో ఆయన చెప్పినట్లే ఎల్బీనగర్కు చెందిన ఓ శివస్వామిని ఆశ్రయించింది. ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న స్వామి ఓ రోజు ఆమె ఇంటికి వచ్చాడు. ఇంటి దోషం కారణంగా భర్త చనిపోయాడని చెప్పి నమ్మించాడు. పూజలు చేయకుంటే ఇంకా అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉందని భయపెట్టాడు. పూజల పేరుతో రూ. 1.70 లక్షలు వసూలు చేశాడు. కనకదుర్గ ఆలయంలో పూజల కోసం మరో 20 తులాల ఆభరణాలు లెక్చరర్ నుంచి తీసుకున్నాడు.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
పూజలు చేస్తున్న క్రమంలోనే ఆలయ అర్చకుడు చనిపోయాడంటూ ఆమెను భయపెట్టాడు. అలా కాచిగూడలోని ఇంటిపత్రాలను సైతం కాజేశాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న అధ్యాపకురాలి కుమార్తె.. తల్లిని తీసుకుని శివస్వామి వద్దకు వెళ్లి గొడవ చేసింది. దీంతో తీసుకున్న ఇంటిపత్రాలను తిరిగి ఇచ్చేశాడు. నగదు, 20 తులాల బంగారం మాత్రం ఇవ్వలేదు. దీంతో బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
Danam Nagender : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు. మరోవైపు ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని వెల్లడించారు.
danam nagender brs
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు. ఎప్పటినుండో కేసీఆర్ ను చూడ్డానికి జనం ఆశగా ఉన్నారని.. సభకు కూడా జనం బాగా వస్తారని తాను కూడా అనుకుంటున్నాని తెలిపారు. హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణగూడ కమ్యూనిటీ హల్ లో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని దానం వెల్లడించారు.
Also read : పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!
వ్యక్తిగతంగా బాధించింది
అయితే రాష్ట్ర సీఎస్ శాంతకుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. శాంతకుమారికి మంచి అధికారిగా పేరు ఉందన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని వెల్లడించారు. కాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్పై దానం అనుకూలంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మళ్లీ దానం బీఆర్ఎస్లోకి వెళ్తారంటూ పోలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read : ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
INS surat: యుద్ధానికి సిద్ధం.. క్షిపణి ప్రయోగించిన భారత్
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో మేం చనిపోలేదు.. ఆ వీడియోలో ఉన్నది వినయ్ నర్వాల్, హిమాన్షి కాదు - షాకింగ్ వీడియో రిలీజ్
మలయాళ నటితో రొమాన్స్.. గోపీచంద్ కొత్త సినిమా ముహూర్తం! ఫొటోలు వైరల్
Pahalgam Attack: ముమ్మాటికి భద్రతా లోపమే.. అమిత్ షా, మోదీ రాజీనామా చేయాలి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!
High Tension In Tirupati🔴LIVE : తిరుమలలో ఉగ్రదాడి టెన్షన్ | Tight Security In Tirumala | TTD | RTV