ED: కేటీఆర్‌కు బిగ్ షాక్.. మరో కేసు నమోదు

ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనిపై రంగంలోకి దిగిన ఈడీ.. కేటీఆర్‌పై మరో కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్‌ నమోదు చేసింది.

New Update
KTR Arrest Latest Reaction

ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనిపై రంగంలోకి దిగిన ఈడీ.. కేటీఆర్‌పై మరో కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్‌ నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం. కేటీఆర్, ఐఏఎస్‌ అర్వింద్ కుమార్, అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్ఎన్‌ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. 

ఇది కూడా చూడండి:  AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!

Formula E-Car Race Scam Case

ఇదిలాఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేస్‌ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ ఏసీబీ కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏ1 కేటీఆర్, ఏ2 అర్వింద్ కుమార్, ఏ3 బీఎల్‌ఎన్‌ రెడ్డిపై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించగా శుక్రవారం విచారణ జరిగింది. ప్రాథమిక దర్యాప్తు పూర్తికావడం వల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌ రెడ్డి వాదించారు.

ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!  

మరోవైపు కేటీఆర్‌ తరఫున సీనియర్ లాయర్ సుందరం,  గండ్ర మోహన్‌రావు, ప్రభాకర్‌రావు వాదనలు వినిపించారు. కేటీఆర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని.. ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోర్టును కోరారు. అయితే ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. డిసెంబర్‌ 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో విచారణ కొనసాగించవచ్చొని పేర్కొంది. 10 రోజుల్లోనే కౌంటర్ దాఖలు చేయాని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 27కు వాయిదా వేసింది. అయితే మళ్లీ తాజాగా కేటీఆర్‌పై ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు

ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Danam Nagender : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు.  బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు.  కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు.  మరోవైపు ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని వెల్లడించారు.

New Update
danam nagender brs

danam nagender brs

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు.  బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు.  కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు.  ఎప్పటినుండో కేసీఆర్‌ ను చూడ్డానికి జనం ఆశగా ఉన్నారని..   సభకు కూడా జనం బాగా వస్తారని తాను కూడా అనుకుంటున్నాని తెలిపారు.  హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణగూడ కమ్యూనిటీ హల్ లో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని దానం వెల్లడించారు.  

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

వ్యక్తిగతంగా బాధించింది

అయితే  రాష్ట్ర సీఎస్ శాంతకుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. శాంతకుమారికి మంచి అధికారిగా పేరు ఉందన్నారు.  కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని వెల్లడించారు.  కాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్‌పై దానం అనుకూలంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మళ్లీ దానం బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ పోలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.  ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్  తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.  

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

Advertisment
Advertisment
Advertisment