Aarogyasri card : ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? అయితే ఈ శుభవార్త మీ కోసమే

తెలంగాణలో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు రేవంత్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ పథకంలోకి మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రులను చేర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనివల్ల కార్డుదారులకు మరింత వెసలుబాటు కలిగే అవకాశం ఉంది.

New Update
Aarogyasri card

Aarogyasri card

Aarogyasri card : తెలంగాణలో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు రేవంత్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ పథకంలోకి మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రులను చేర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనివల్ల కార్డుదారులకు మరింత వెసలుబాటు కలిగే అవకాశం ఉంది.  ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో 1,042 ఆస్పత్రులుండగా, ఇందులో 409 ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయి. దీనికి తోడు  ఈ పథకంలోకి కొత్తగా 164 ప్రైవేటు ఆస్పత్రులను చేర్చేందుకు రేవంత్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీంతో వాటి సంఖ్య మరింత పెరగనుంది. కొత్తగా 164 హాస్పిటల్స్‌లో రోగులకు ఎలాంటి రుసుము లేకుండా చికిత్స అందించనున్నారు. ఇక ఆరోగ్యశ్రీ ఖర్చును కూడా ప్రభుత్వం పెంచింది.ప్రభుత్వం చికిత్స ఖర్చును రూ.10 లక్షలకు పెంచడంతోపాటు మొత్తంగా 1,835 వ్యాధులను చేర్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద 2024---25లో 3.53 లక్షల మంది రోగులు చికిత్స చేయించుకున్నారు.

Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
 
మరోవైపు తెలంగాణలోని వృద్ధులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 2025 నుంచి 70 ఏళ్లు పైబడిన వారికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమాను ప్రభుత్వం అందిస్తోంది. ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ ద్వారా ఈ సదుపాయం లభిస్తుంది. ఆధార్ కార్డులో వయసు ఉంటే చాలు, ఈ పథకానికి అర్హులు. ఆరోగ్య శ్రీ, PMJAY ద్వారా లబ్ధి పొందుతున్న వారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య అధికారులు నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ స్కీమ్ ద్వారా వృద్ధులకు ఉచిత వైద్యం అందుతుంది. ట్రీట్‌మెంట్, సర్జరీలు, హాస్పిటాలిటీ, మెడిసిన్ ఖర్చులన్నీ కలిపి రూ. 5 లక్షల వరకు ఉచితంగా పొందవచ్చు. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా, కేవలం వయసు ఆధారంగా ఈ పథకం వర్తిస్తుంది.

Also Read: 🔴Live News Updates: ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ (CGHS) లేదా ఇతర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు కూడా ఆయుష్మాన్ వయో వందనకు అర్హులే. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారు కూడా ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందవచ్చు. దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ స్కీమ్ కు వయసు మాత్రమే ముఖ్యమైన అర్హత. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డు పొందడానికి అర్హులు.

Also Read: Ap Weather Report: నేడు 126 మండలాల్లో తీవ్ర వడగాలులు...హెచ్చరికలు జారీ !


                                                
                                            
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Adilabad Airport : తెలంగాణకు గుడ్ న్యూస్...మరో ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణకు మరో భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది కేంద్రం. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే వరంగల్ మామూనూర్ ఎయిర్‌పోర్ట్‌కు అనుమతివ్వగా..తాజాగా మరో ఎయిర్‌పోర్ట్‌కు భారత వాయుసేన(IAF) అనుమతివ్వడం విశేషం.

New Update
Adilabad Airport

Adilabad Airport

Adilabad Airport : తెలంగాణకు మరో భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది కేంద్రం. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే వరంగల్ మామూనూర్ ఎయిర్పోర్టు కు కేంద్రం అనుమతివ్వగా.. తాజాగా మరో ఎయిర్‌పోర్ట్‌కు భారత వాయుసేన(IAF) అనుమతి మంజూరు చేయడం విశేషం. ఈ మేరకు తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు, తెలంగాణ ప్రజలందరికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకుముందు మామునూర్ ఎయిర్ పోర్టుకు అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు అనుమతులు సాధించడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Also Read :  హనుమంతుడి ఈ 4 మంత్రాలు పఠిస్తే.. మీ కష్టాలన్నీ పరార్!

త్వరలోనే అక్కడ  వాయుసేన శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ గా అభివృద్ధి చేయాలని వాయుసేన లేఖ ద్వారా సూచించిందని కోమటిరెడ్డి తెలిపారు. రన్ వే పునర్నిర్మాణ , పౌర టర్మినల్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఎప్రాన్ సహా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు కోమటిరెడ్డి. వీటికి అవసరమైన భూమిని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇవ్వాలని వాయుసేన సూచించినట్లు చెప్పారు. ఈ విషయంపై   అధికారులతో సమీక్షిస్తున్నామని...త్వరలోనే అన్ని వివరాలతో కూడిన నివేదికను కేంద్రానికి పంపిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 

ఇది కూడా చదవండి: ఏప్రిల్ 30న ఏం కొనాలి? ఏం కొనొద్దు?.. ఇలా చేస్తే మీరే కోటీశ్వరులు!
 
ఆరు నెలల స్వల్పవ్యవధిలోనే రెండు ఎయిర్ పోర్టులకు అనుమతులు సాధించడం.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమని అన్నారు. ఈ ఎయిర్పోర్టును సివిల్ ఏవియేషన్, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ గా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించినట్టు తెలిపిన మంత్రి.. సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ రాకపోకలకు అనువుగా రన్‌వే పునర్నిర్మాణం చేయడం, సివిల్ టర్మినల్ ఏర్పాటు, ఎయిర్‌క్రాఫ్ట్ ఎప్రాన్ (విమానాలు నిల్చోవడానికి, మలుపులు తిరగడానికి మరియు ఇతర విమానయాన కార్యకలాపాలకు ఉపయోగించే నిర్దిష్ట ప్రాంతం) వంటి ఇతర మౌలిక వసతులను అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.

Also Read: Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి

ఇందుకు అవసరమైన భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సమకూర్చుకోవాలని వాయుసేన అధికారులు లేఖలో సూచించినట్టు మంత్రి తెలియజేశారు. తెలంగాణలో మొన్న మామునూర్, నేడు ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులకు అనుమతుల మంజూరీలో సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి, రాష్ట్రంలో ఏయిర్ పోర్ట్ ల ఏర్పాటుకు అండగా నిలబడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!

Advertisment
Advertisment
Advertisment