ప్రతి కుటుంబానికి డిజిట‌ల్ కార్డు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి డిజిట‌ల్ కార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రేష‌న్‌, ఆరోగ్యశ్రీతోపాటు ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలన్నింటికి ఒకే కార్డు ద్వారా అందించేలా విధివిధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు.

New Update
CM revanth

TG NEWS: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలి డిజిట‌ల్ కార్డు ఇవ్వాల‌ని రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేష‌న్‌, ఆరోగ్య, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలన్నింటిని ఒకే కార్డు ద్వారా అందించాల‌నే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం త‌న నివాసంలో ఈ అంశంపై వైద్యారోగ్య, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. కుటుంబాల స‌మ‌గ్ర వివ‌రాల న‌మోదుతో ఇప్పటికే రాజ‌స్థాన్, హ‌ర్యానా, క‌ర్ణాట‌క రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయ‌నం చేయాల‌ని, వాటితో క‌లుగుతున్న ప్రయోజ‌నాలు, ఇబ్బందుల‌పై అధ్యయ‌నం చేసి ఒక స‌మ‌గ్ర నివేదిక రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 

అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందేలా..

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఒక ప‌ట్టణ‌, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని పైలెట్ ప్రాజెక్టు కింద ఈ ఫ్యామిలి డిజిటల్ కార్డుల‌కు సంబంధించి కార్యాచ‌ర‌ణ ప్రారంభించాల‌ని రేవంత్ సూచించారు. అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందేలా ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులు ఉండాల‌ని, ఈ కార్డుల‌తో ల‌బ్ధిదారులు ఎక్కడైనా రేష‌న్‌, ఆరోగ్య సేవ‌లు పొందేలా ఉండాల‌ని తెలిపారు. ఈ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులో ప్రతి కుటుంబ స‌భ్యుని హెల్త్ ప్రొఫైల్ ఉండాల‌ని, అది దీర్ఘకాలంలో వైద్య సేవ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అధికారులకు సూచించారు. ఆయా కుటుంబ స‌భ్యులు త‌మ కుటుంబాల్లో స‌భ్యుల క‌ల‌యిక‌, తొల‌గింపున‌కు సంబంధించి ఎప్పటిక‌ప్పుడు కార్డును అప్‌డేట్ చేసుకునేలా ఉండాల‌న్నారు. 

ఈ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల వ్యవ‌స్థ మానిట‌రింగ్ కు జిల్లాలవారీగా వ్యవస్థల‌ను ఏర్పాటు చేయాల‌ని అధికారులను ఆదేశించారు. స‌మావేశంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యద‌ర్శి అజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యద‌ర్శులు చంద్రశేఖ‌ర్‌రెడ్డి, సంగీత స‌త్యనారాయ‌ణ‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్ డీఎస్ చౌహాన్‌, ఆరోగ్య శాఖ కార్యద‌ర్శి క్రిస్టియానా జ‌డ్ చోంగ్తూ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

విషాదం.. సరదాగా పొలానికి వెళ్లిన చిన్నారి.. ఆ తర్వాత ఏమైందంటే?

కరీంనగర్‌లో సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అత్తమ్మ వాళ్లు పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లి ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. ట్రాక్టర్‌తో పాటు చిన్నారి బావిలోకి దూసుకెళ్లడంతో మృతి చెందింది.

New Update
suryapet crime

Crime

సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మూడేళ్ల చిన్నారి అత్తమ్మ ఇంటికి సరదాగా వెళ్లింది. అత్తమ్మ కుటుంబ సభ్యులు అందరూ కూడా పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లింది. అక్కడ ట్రాక్టర్ ఎక్కిస్తే నవ్వుతూ కూర్చొంది.

ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

ఒక్కసారిగా తాళం తిప్పడంతో..

ఆమెను ట్రాక్టర్ ఎక్కించిన తర్వాత అత్తమ్మ కొడుకును ఎక్కించడానికి పక్కకి వెళ్లారు. ఇంతలో ఆ మూడేళ్ల పాప ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. దీంతో ఆ చిన్నారితో పాటు ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

ఇదిలా ఉండగా ఈమధ్య కాలంలో పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి  కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది.

ఇది కూడా చూడండి: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం రాయ్‌బరేలీలో స్థానికంగా ఉండే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇందుకోసం వారు ఓ తుపాకీని కూడా అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.  అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భార్య, ఆమె ప్రియుడు నిందితులని తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు.  

Advertisment
Advertisment
Advertisment