Yadagirigutta : యాదగిరిగుట్ట కు పోటెత్తిన భక్తులు...మూడు రోజులు సెలవులతో...

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శని,ఆదివారం సెలవుదినాలతో పాటు సోమవారం అంబేడ్కర్‌ జయంతి కూడా సెలవు ప్రకటించడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు దైవ దర్శానానికి తరలివచ్చారు.

New Update
Yadagirigutta

Yadagirigutta

Yadagirigutta : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వారంతపు సెలవులు కావడంతో గుట్గపై రద్దీ నెలకొంది. శని,ఆదివారం సెలవుదినాలతో పాటు సోమవారం అంబేడ్కర్‌ జయంతి కూడా సెలవు ప్రకటించడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు దైవ దర్శానానికి తరలివచ్చారు.

Also Read: కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

హైదరాబాద్‌తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వాహనాలపై తరలివచ్చారు. కొండకింద పార్కింగ్‌ ప్రదేశం వాహనాలతో నిండిపోయి వైకుంఠ ద్వారం ఇరువైపులా వాహనాలు పార్కింగ్‌ చేశారు. ఉభయ (ప్రత్యేక, ధర్మదర్శన) క్యూలైన్లు భక్తులతో ఉదయం నుంచే రద్దీగా ఉన్నాయి. వీఐపీ టికెట్‌ దర్శనానికి గంటన్నర, ధర్మదర్శనానికి రెండు గంట సమయం పడుతుందని భక్తులు తెలిపారు.

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ఉదయం పూటే దర్శనానికి వెళ్లాలనే ఉద్ధేశంతో భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ప్రధానాలయం, ఉత్తర ప్రాకార మండపం, కొండకింద వ్రత మండపాలు, లక్ష్మీ పుష్కరిణి, అన్నప్రసాద సత్రం, బస్టాండ్‌, కొండపైన తిరువీధులు, బస్టాండ్‌, ప్రసా ద విక్రయశాలల్లో కూడా భక్తుల సందడి నెలకొంది. యాదగిరి గుట్ట దర్శనం అనంతరం సమీపంలో ఉన్న సురేంద్రపురి, స్వర్ణగిరి దేవాలయాలను కూడా సందర్శించానే ఉద్ధేశంతో భక్తులు పెద్ద సంఖ్యలో యాదాద్రికి చేరుకున్నారు.

Also Read: Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!

లక్ష్మీనృసింహుడికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు

సుప్రభాత సేవతోస్వామి అమ్మవార్లను మేల్కొలిపిన అర్చకస్వాములు స్వయంభువులకు సంప్రదాయరీతిలో నిత్యపూజలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్య కల్యాణోత్సవ పర్వాలు వైభవంగా చేపట్టారు. అనుబంధ ఆలయమైన పాతగుట్టలోనూ స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు ఘనంగా చేపట్టారు. శివాల యంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారికి నిత్య పూజలు, రుద్రహవన పూజలు, శైవాగమరీతిలో జరిపారు. రాత్రి మహానివేదన, శయనోత్సవాలతో ఆయన ద్వారబంధనం చేశారు.

Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoists Surrenders : మావోయిస్టులకు షాక్‌...13 మంది లొంగుబాటు

వరుస ఎన్‌కౌంటర్లతో పలువురు మావోలు మృత్యువాత పడుతుంటే మరోవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.  తాజాగా వరంగల్ పోలీసుల ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

New Update
Maoists Surrenders

Maoists Surrenders

Maoists Surrenders : సమసమాజ నిర్మాణమే ధ్యేయమనే లక్ష్యంతో ఆయుధాలు పట్టి అడవుల్లో పోరాడుతున్న మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు వరుస ఎన్‌కౌంటర్లతో పలువురు మావోలు మృత్యువాత పడుతుంటే మరోవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.  తాజాగా వరంగల్ పోలీసుల ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

ఇది కూడా చదవండి: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!

ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మావోయిస్టులకు రివార్డులు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ బీజాపూర్ ప్రాంతం గుత్తికోయ కమ్యూనిటికి చెందిన వారని తెలిపారు. తెలంగాణ పోలీసులు కల్పించిన అవహాగాహనతో వీరంతా తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు చెప్పారు. ఈ ఏడాదిలో 250 మంది మావోయిస్టులు లొంగిపోతే వారిలో 90 శాతం మంది ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని చెప్పారు. వారందరూ ఇక మీదట మావోయిస్టులకు సహకరించమని తేల్చి చెప్పారన్నారు. వారికి అందజేసిన రివార్డులతో స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
 
ఇక ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దు్లోని కర్రెగుట్టల్లో జరుగుతున్న కూంబింగ్ లో తెలంగాణ పోలీసుల ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ కూంబింగ్ ఛత్తీస్ గఢ్, కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ అన్నారు. ఈ విషయంలో మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదన్నారు. తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్ ప్రమేయం లేదన్నారు. కర్రెగుట్ట ఘటనలో మావోయిస్టులు ఎవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు అనే విషయంలో స్పష్టత లేదని తేల్చి చెప్పారు.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

Advertisment
Advertisment
Advertisment