Bhatti Vikramarka : కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు .. భట్టి వార్నింగ్!

కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. కాంగ్రెస్ పాలనలో పనులు కావాలంటే 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీంతో భట్టి ఫైర్ అయ్యారు.  ళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరించారు.

New Update
ktr-vs-bhatti-fire

ktr-vs-bhatti-fire

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. కాంగ్రెస్ పాలనలో పనులు కావాలంటే 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ అసెంబ్లీలో హాట్ టాపిక్ గా మారాయి.  దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటుగా కాంగ్రెస్‌ సభ్యులు ఆయనపై మండిపడ్డారు. వెంటనే కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలు నిజమైతే  నిరూపించాలని డిప్యూటీ సీఎం సవాల్ విసిరారు.  మీలా బరితెగించి రాజకీయాలు చేయడం లేదంటూ భట్టి ఫైర్ అయ్యారు.  

Also read : యూఎస్‌ హెల్త్‌ ఏజెన్సీకి అధిపతిగా భారత సంతతి వ్యక్తి నియామకం!

Also read :  TG Politics: మంత్రి కోమటిరెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ.. పార్టీ మార్పుపై కీలక ప్రకటన!

ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు.. అడ్డగోలుగా దోచుకున్నది మీరు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ  భట్టి హెచ్చరించారు. అయితే కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌ను సభ రికార్డుల నుంచి స్పీకర్‌ తొలగించారు. అయితే కేటీఆర్‌పై భట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  వాక్ ఔట్ చేశారు. లాబీల్లో బీఆర్ఎస్ నేతలు  వద్దురా నాయన 20% పాలన అంటూ నినాదాలు చేశారు.  

Also read :  పోస్టులు పెడితే అరెస్టులు చేస్తారా?.. AP పోలీసులకు హైకోర్టు బిగ్‌షాక్!

Also read :  ''అమ్మలు హ్యాపీ బర్త్ డే'' భార్యకు ఎన్టీఆర్ విషెస్.. ఫొటోలు వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు