Crypto Fraud : జగిత్యాలలో క్రిప్టో మోసం.. రూ.70 లక్షలు ఫట్

జగిత్యాల జిల్లాలో భారీ క్రిప్టో మోసం వెలుగు చూసింది. జగిత్యాలకు చెందిన రాకేష్ అనే వ్యక్తి క్రిప్టో బిజినెస్ పేరుతో పలువురి నుంచి రూ.70 లక్షల వరకు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.

New Update
 Crypto Fraud

Crypto Fraud

 Crypto Fraud : జగిత్యాల జిల్లాలో భారీ క్రిప్టో మోసం వెలుగు చూసింది. జగిత్యాలకు చెందిన రాకేష్ అనే వ్యక్తి క్రిప్టో బిజినెస్ పేరుతో పలువురి నుంచి రూ.70 లక్షల వరకు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లాకు చెందిన రాకేష్  తనకు తెలిసిన వారితో పాటు చాలా మందితో పరిచయాలు పెంచుకున్నాడు. అందరితో కలివిడిగా ఉండడంతో అంతా నమ్మారు. ఆ నమ్మకంతోనే మెటఫండ్ అనే కంపెనీలో బాధితుల నుంచి పెట్టుబడి పెట్టించాడని ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరితో  రూ.7లక్షల వరకు పెట్టుబడులు పెట్టించాడని.. మరి కొందరితో రూ.70 లక్షల దాకా పెట్టుబడులు పెట్టించాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితులంతా రాకేష్ ను నిలదీశారు.

Also Read: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్‌లో ఏరులై పారిన నెత్తురు!
 
అడిగినప్పుడల్లా రేపు, మాపు అంటూ గత 8 నెలలుగా తమను రాకేష్ వెంట తిప్పించుకుంటున్నాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక చివరకు రాకేష్ ఇంటి అడ్రస్ కనుక్కుని బాధితులు అక్కడకు వెళ్లారు. రాకేష్ సమయానికి ఇంట్లో లేకపోవడంతో వారంతా ఆందోళన చేపట్టారు. దీంతో కుటుంబ సభ్యులు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బాధితులను కంప్లయింట్ ఇవ్వాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాకేష్ వెంటనే వచ్చి బాధితులతో మాట్లాడాడు. కొంత టైమ్ ఇస్తే డబ్బులు మొత్తం తిరిగి ఇస్తానని హామీ ఇవ్వడంతో వారంతా ఫిర్యాదు చేయకుండానే బయలు దేరారు. డబ్బులు అడిగినప్పుడల్లా రాకేష్ ఇలాగే దాటవేస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. 

Also Read: ఆన్‌లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష!

అయితే రాకేష్‌ మెటఫండ్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో బిజినెస్‌ నిర్వహిస్తోంది. పెట్టిన పెట్టుబడికి అధిక లాభాలిస్తామని ఆ కంపెనీ పెట్టుబడులు పెట్టించుకున్నట్లు తెలిసింది. బాధితులు ఎవరూ కూడా ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

Also Read: మరోసారి విషం చిమ్మిన పాకిస్థాన్.. ట్రైన్‌ హైజాక్‌కు భారత్‌ సాయం చేసిందని ఆరోపణలు

Also Read: అమ్మకానికి కన్యత్వం.. నెట్టింట 22ఏళ్ల విద్యార్థిని రచ్చ.. కోట్లు గుమ్మరించిన హాలీవుడ్ హీరో!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

EX MLC Jeevan Reddy Vs MLA Sanjay Kumar : మళ్లీ వేడెక్కిన జగిత్యాల రాజకీయాలు..ఎమ్మెల్యే..మాజీ ఎమ్మెల్సీ మధ్య వార్‌

జగిత్యాల నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒకరిపై మరొకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. జీవన్ రెడ్డికి ఎందుకంత ఉలికిపాటో అర్థం కావడం లేదనిసంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.

New Update
Jeevan Reddy Vs MLA Sanjay Kumar

Jeevan Reddy Vs MLA Sanjay Kumar

కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి ఓ న్యాయం.. మిగతా వారందరికీ మరో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఆయన కండువా కప్పలేదా? అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. తన వెంట తిరిగి అనుకూలంగా పని చేసిన బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు, డీసీసీ ఛైర్మన్లు సహా చాలా మందిని కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి చేర్చుకున్నారంటూ ఆరోపించారు.తాను చేస్తే ఒప్పు.. మిగతా వాళ్లు చేస్తే తప్పన్నట్లు ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తనకు ఇవే చివరి ఎన్నికలని జీవన్ రెడ్డి చెప్పారని, మరి మీ స్థానంలో కొత్త నాయకత్వం రావొద్దా? అంటూ సూటిగా ప్రశ్నించారు. జీవన్ రెడ్డికి నీతులు చెప్పాలని అనుకోవడం లేదని, ఆయన హుందాగా నడుచుకుంటే బాగుంటుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చురకలు అంటించారు.

ఇది కూడా చదవండి:  పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!
 
 పేదలకు లబ్ది చేకూరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది. ప్రజల్లో సన్న బియ్యంపై ఉన్న అపోహలను తొగించేందుకు ప్రజాప్రతినిధులు సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో భోజనం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గంలోని ఓ రేషన్ కార్డు లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అనంతరం మీడియాతో మాట్లాడిన సంజయ్ కుమార్.. సోమవారం కాంగ్రెస్ మాజీ ఎమ్మల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి

Also Read :  Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ (వీడియో చూశారా)

Advertisment
Advertisment
Advertisment