Bhadrachalam : భద్రాచలంలో ముదురుతున్న వివాదం.. వైదిక అంశాల్లో తలదూర్చొద్దంటూ అల్టిమేటం

భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆలయ ఈవో, వైదిక కమిటీకి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజంను పర్ణశాలకు బదిలీ చేయడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో ఉత్సవ పనులకు అంకురార్పణను అర్చకులు నిలిపివేశారు.

New Update
Bhadrachalam

Bhadrachalam

Bhadrachalam : భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆలయ ఈవో, వైదిక కమిటీకి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజంను పర్ణశాలకు బదిలీ చేయడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో ఉత్సవ పనులకు అంకురార్పణను అర్చకులు నిలిపివేశారు. అంకురార్పణ జరపాల్సింది ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజమేనని ఆయన లేకుండా అంకురార్పణ కుదరదని వైదిక కమిటీ తేల్చి చెప్పింది. దీంతో చేసేది లేక సాయంత్రానికి తిరిగి ఆయనను ప్రధాన ఆలయానికి రప్పించారు. ఈ వివాదం వల్ల అంకురార్పణ నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఇంతటితో వివాదం ముగిసిందనుకుంటే సమస్య మరింత జఠిలంగా మారింది.

ఇది కూడా చూడండి: Nitin Gadkari: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

వైదిక కమిటీ వర్సెస్ కార్య నిర్వాహక కమిటీ మధ్య కలహాలు తారాస్థాయికి చేరాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఒక వీడియో విడుదల చేశారు.  ఈవో అవగాహన లేమి, మొండిపట్టు కారణంగానే అంకురార్పణ ఆలస్యమైందని వెల్లడించారు.వైదిక వ్యవహారాల్లో సర్వాధికారాలు ఆలయ ప్రధాన అర్చకులకే ఉంటాయని స్పష్టం చేశారు. కల్యాణ బ్రహ్మ విషయంలో ఈవో  రమాదేవి నిర్ణయం కారణంగానే అంకురార్పణ ఆలస్యమైందని వైదిక కమిటీ తేల్చి చెప్పింది.
 ఆలయ ఈవోగా ఎవరూ వ్యవహరించినా ఏకఛత్రాధిపత్యం కుదరదని అర్చకులు చురకలంటించారు. ఈవో మార్పును తాము కోరడం లేదని సమన్వయం సయోధ్యతోనే స్వామి వారి కైంకర్యాలను ముందుకుతీసుకుపోవాలని కోరుతున్నట్లు వెల్లడించారు. వివాదం రేపిన అంకురార్పణ ఆలస్యంపై క్లారిటీ ఇవ్వడానికే వీడియో విడుదల చేసినట్లు వైదిక కమిటీ తెలిపింది. కార్యనిర్వాహక వ్యవహారాల్లో తాముతలదూర్చమని, వైదిక వ్యవహారాల్లోనూ ఆలయ ఈవో తలదూర్చకుండా ఉంటే సమస్యలు ఉత్పన్నం కావని ఆలయ పండితులు స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్‌ సంచలనం!

కాగా శ్రీసీతారాముల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల వేళ వైదిక కమిటీ కార్యనిర్వాహక విభాగాల మధ్య అంతరాలు, వివాదాలు ముదురుతుండటంతో రామభక్తుల అసహనం వ్యక్తం చేస్తు్న్నారు. ఇరువురి మధ్య భేధాభిప్రాయాల కారణంగా ఆలయప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా దేవాదాయ శాఖ మౌనం వహిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కమిషనర్  కలుగజేసుకుని తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు సాఫీగా సాగేలా దేవస్థాన సమన్వయ అధికారిని నియమించాలని భక్తులు కోరుతున్నారు.

ఇది కూడా చూడండి: Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment