/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
Rains
Rain Alert : ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వరుణుడు కూడా తన సత్తా చాటుతున్నాడు. పొద్దంతా ఎండలు రాత్రి వర్షాలు అన్నట్లు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.
Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా
నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉందని, ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి.. రాగల 24గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనంగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్
ఈ క్రమంలో మంగళవారం ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 11న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Jeevan Reddy: సీఎం రేవంత్పై తిరగబడ్డ జీవన్ రెడ్డి!
TG: MLC జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తాను మానసిక ఆవేదనలో ఉన్నానని అన్నారు. ఫిరాయింపులకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు.
MLC Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తాను మానసిక ఆవేదనలో ఉన్నానని అన్నారు. ఫిరాయింపులకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువలు పాటించాలని అన్నారు. ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని.. గతంలో ఈ ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ పోరాటం చేశారని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: సంచలన విషయాలు బయటపెట్టిన వైసీపీ
10ఏళ్లుగా పోరాడుతున్న....
ఈరోజు మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. గత పదేళ్లుగా కష్టంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. ఇతర పార్టీల నుంచి పదవుల ఆఫర్లు వచ్చిన తాను ఎన్నడూ కాంగ్రెస్ ను వీడలేదని చెప్పారు. పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీతో తాను పోరాటం చేశానని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఖాళీ కావడానికి ప్రధాన కారణమైన పోచారం శ్రీనివాస్ ను తిరిగి పార్టీలో చేర్చుకోవడం చాలా బాధ కలిగించిందని చెప్పారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన పోచారం శ్రీనివాస్ ను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా.. కీలక పదవులు కట్టబెట్టం మహా దారుణం అని అన్నారు. పార్టీలో కష్టపడ్డా వారికి పదవులు ఇవ్వాలని తప్ప ఫిరాయింపులు చేసిన నేతలకు కాదని అన్నారు.
Also Read : మా వాడు క్వీన్ ఎలిజబెత్-2 రేంజ్! మేడమ్ టుస్సాడ్స్ లో ఆ ప్రత్యేక గౌరవం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంపించాడు...
తన ప్రధాన అనుచరుడిని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చంపించారని జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్లు బీఆర్ఎస్ పై పోరాడిన తనకు మంచి బహుమతి లభించిందని అన్నారు. తనతో చర్చించకుండా.. తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడం చాలా బాధేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులకు ఏమని చెప్పాలని అన్నారు. ఇప్పటికైనా వేరే పార్టీ నుంచి గెలిచి తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారని అన్నారు. వారి నమ్మకాన్ని ప్రభుత్వం, పార్టీ కాపాడుకోవాలని సూచించారు. అధిష్టానం తీసుకునే నిర్ణయంపై తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు.
Also Read : పైనాపిల్ తింటే అంతే సంగతి!
Also Read : షర్మిల సంచలన నిర్ణయం!
Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక
రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. Short News | Latest News In Telugu | వాతావరణం
TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
భద్రాధ్రికొత్తగూడెం జిల్లా జడ్ వీరభధ్రాపురంలో చేతబడి నెపంతో సొంత బాబాయినే కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
Gym Trainer Kills : జిమ్ నిర్వాహకుడిని చంపిన యువకుడు.. డంబెల్స్తో కొట్టి కొట్టి....
జిమ్ ట్రైనర్ పై డంబెల్ తో దాడి చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Allu Arjun : అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్తత...భారీకేడ్లు తోచుకుని.
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అభిమానులు భారీగా చేరుకొని సందడి చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Accident: హైదరాబాద్లో లారీ బీభత్సం..ట్రాఫిక్ పోలీసు దుర్మరణం!
హైదరాబాద్లో లారీ బీభత్సం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద విధుల్లోవున్న. : క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Newly bride suicide : పెళ్లయిన 22 రోజులకే నవ వధవు సూసైడ్..ఎందుకంటే....
పెళ్లయిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ
USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..
Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్
WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్
Instagram: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు