Sale of children : హైదరాబాద్ లో కలకలం.. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకువచ్చి..

కాదేది బిజినెస్‌కు అనర్హం అన్నట్లు.. అడ్డదారుల్లో సంపాదించాలనుకున్నవారు ఏదైనా చేసి డబ్బులు కూడబెట్టేందుకు వెనుకాడడటం లేదు. తాజాగా చిన్నారులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న రెండు ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముఠాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

New Update
Sale of children

Sale of children

 Sale of children :  కాదేది బిజినెస్‌కు అనర్హం అన్నట్లు.. అడ్డదారుల్లో సంపాదించాలనుకున్నవారు ఏదైనా చేసి డబ్బులు కూడబెట్టేందుకు వెనుకాడడటం లేదు. తాజాగా చిన్నారులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న రెండు ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. చైతన్యపురి ఠాణా పరిధిలో చిన్నారులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరు గుజరాత్‌ నుంచి పిల్లలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తు్న్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసుల సాయంతో చైతన్యపురి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా నలుగురు చిన్నారులను రక్షించడంతో పాటు 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు గుజరాత్‌ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఓటీ పోలీసులు రంగంలోకి దిగి నలుగురు చిన్నారులు రక్షించి, 11 మందిని అరెస్ట్‌ చేశారు. నిందితులు కోలాక కృష్ణవేణి, దీప్తి, గౌతం సావిత్రి దేవి, శ్రవణ్‌కుమార్‌, ఆమ్‌ గోత్‌ శారదా, సంపత్‌కుమార్‌గా గుర్తించారు. పిల్లల్ని కొనుగోలు చేసిన నాగ వెంకట పవన్‌ భగవాన్‌, రమా శ్రావణి, వినయ్‌ కుమార్‌, స్వాతి, రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 11 ఫోన్లు, రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులను విక్రయించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు

రాచకొండ పరిధిలో మరో ముఠా


మరో సంఘటనలో పసి పిల్లలను విక్రయించే ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ముఠాను మయన్మార్ దేశానికి చెందిన దంపతులు నడిపిస్తున్నారని పోలీసులు తెలిపారు.మయన్మార్ నుంచి వలస వచ్చిన దంపతులు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో నివాసం ఉంటూ ఈ పసి పిల్లల విక్రయాల దందాను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్ధిక పరిస్థితి భాగలేని వారి నుంచి పసిపిల్లలను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసే ఈ జంట. పిల్లలు లేని దంపతులను గుర్తించి వారికి అధిక ధరల్లో అమ్ముతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.ఈ ముఠాలో మొత్తం 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది.   

Also read :  Attempted murder : మైనర్‌ ప్రేమ.. దానికి ఒప్పుకోలేదని......

ఈ ముఠా ఇప్పటివరకు సుమారు 10 మందికి పైగా పసి పిల్లలను విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాలో మహిళలు కీలక పాత్ర పోషించినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. కాగా ఈ సందర్భంగా ఈ ముఠా విక్రయించిన పసిపిల్లలను కొనుగోలు చేసిన దంపతులను గుర్తించింది. మరోవైపు ముఠాకు అమ్మిన పసిపిల్లలను అమ్మిన తల్లిదండ్రులను కూడా పోలీసులు గుర్తించారు. కొంతమంది పిల్లల్ని ఈ ముఠా కిడ్నాప్ చేసి విక్రయించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.దీనిపై కూడా రాచకొండ ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్‌... 140 సోషల్‌ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!

ఇది కూడా చదవండి: BIG BREAKING: శివాలయానికి వెళ్తుండగా ఏనుగుల గుంపు దాడి.. నలుగురు మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

New Update
Rains

Rains

 Rain Alert : ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వరుణుడు కూడా తన సత్తా చాటుతున్నాడు. పొద్దంతా ఎండలు రాత్రి వర్షాలు అన్నట్లు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా

నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉందని, ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి.. రాగల 24గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనంగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


 ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఈ క్రమంలో మంగళవారం ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 11న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Also read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

Advertisment
Advertisment
Advertisment