TG Politics: మంత్రి కోమటిరెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ.. పార్టీ మార్పుపై కీలక ప్రకటన!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డితో భేటీ కావడం తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. అయితే.. సుధీర్ రెడ్డి పార్టీ మారుతున్నారా? అని కోమటిరెడ్డిని అడగగా.. అది తన పని కాదంటూ బదులిచ్చారు. సుధీర్ రెడ్డి తన బంధువన్నారు.

New Update
MLA Sudheer Reddy Minister Komatireddy

MLA Sudheer Reddy Minister Komatireddy

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే.. నియోజకవర్గంలో పెండింగ్ పనుల విషయంలోనే మంత్రిని కలిశానని సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై వెంకట్ రెడ్డి సైతం స్పందించారు. సుధీర్ రెడ్డి తనకు బంధువు అవుతాడన్నారు. తనకు వరుసకు అల్లుడు అవుతాడని వివరించారు. కాంగ్రెస్ పార్టీ లోకి సుధీర్ రెడ్డిని తీసుకొస్తున్నరా? అని విలేకరులు ప్రశ్నించగా.. అది తన పని కాదంటూ బదులిచ్చారు. 

రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై రియాక్షన్..

తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అంశంపై సైతం కోమటిరెడ్డి స్పందించారు. కేబినెట్ విస్తరణ, మంత్రి పదవుల కేటాయింపుపై తనకు సమాచారం లేదని స్పష్టం చేశారు. మంత్రుల విషయంలో తనను ఎవరు సంప్రదించలేదని స్పష్టం చేశారు. పేపర్, టీవీల్లో చూడటమే తప్పా.. సమాచారం లేదన్నారు. 

సుధీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సుధీర్ రెడ్డి.. 2018లో ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచే బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన మళ్లీ తన సొంత గూటికి చేరుతారన్న చర్చ జరిగింది. కానీ ఆయన మాత్రం బీఆర్ఎస్ లోనే ఉండిపోయారు. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ కావడంతో మరో సారి సుధీర్ రెడ్డి పార్టీ మార్పు అంశం చర్చకు వచ్చింది.

(komatireddy-venkatreddy | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment