/rtv/media/media_files/2025/01/30/TKteyMigwiyf5iTwIX70.jpg)
Shamshabad Airport
Shamshabad Airport: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు ఫోన్ చేసి విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు. కాల్ చేసిన వ్యక్తి కామారెడ్డి జిల్లాకు చెందినవాడని ఆర్జీఐఏ సబ్ ఇన్స్పెక్టర్ డి అప్పారావు తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి తన మొబైల్ ఫోన్ను ఉపయోగించి పోలీస్ స్టేషన్కు కాల్ చేశాడు. కాల్ డేటా రికార్డ్ (సిడిఆర్) వివరాల సహాయంతో, పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి, ప్రశ్నించగా అతను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని కనుగొన్నారు. బెదిరింపు కాల్ అందుకున్న వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్ ను దింపారు. ఎయిర్ పోర్ట్ ఆవరణను క్షుణ్ణంగా వెతికారు. ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ప్రతి వాహనాన్ని, అరైవల్, డిపార్చర్ ఏరియాలను జల్లెడ పట్టారు. బాంబు స్క్వాడ్ ను రప్పించి క్షుణ్ణంగా గాలించారు. గంటల తరబడి క్షుణ్ణంగా తనిఖీ చేశాక ఎయిర్ పోర్ట్ లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఇది బూటకపు కాల్ అని ధృవీకరించారు.
Also Read: Parliament Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు..ఈరోజు అఖిలపక్షం సమావేశం
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
కాల్ చేసింది ఎవరంటే....
పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు.. ఫోన్ చేసిన దుండగుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాఫ్తులో కామారెడ్డి జిల్లాకు చెందిన నితిన్ అనే యువకుడు ఈ బెదిరింపు ఫోన్ కాల్ చేశాడని గుర్తించారు. నితిన్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అతడికి మతిస్థిమితం లేదని తేలింది. దీంతో నితిన్ కుటుంబ సభ్యులను పిలిపించి అతడిని అప్పగించారు.
Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో తొక్కిసలాటతో స్పెషల్ రైళ్లు రద్దు.. రైల్వేశాఖ క్లారిటీ!
Also Read: జూ.ఎన్టీఆర్ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్!