bird flue : బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. 5 వేల 540 పైగా కోళ్లు మృతి..  రూ.500 కోట్ల నష్టం!

బర్డ్ ఫ్లూ వైరస్ ఎఫెక్ట్  ఫౌల్ట్రీ పరిశ్రమపై గట్టిగానే  పడింది. కోళ్ల మృత్యువాత పడుతున్నాయి. దీంతో జనాలు భయపడిపోయి చికెన్, గుడ్లు తినడం లేదు. వనపర్తి జిల్లాలో 5,540 కోళ్లు మృత్యువాత పడగా.. నెలలో రూ.500 కోట్ల నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు.

New Update
kollu

బర్డ్ ఫ్లూ వైరస్ ఎఫెక్ట్  ఫౌల్ట్రీ పరిశ్రమపై గట్టిగానే  పడింది. కోళ్ల మృత్యువాత పడుతున్నాయి. దీంతో జనాలు భయపడిపోయి చికెన్, గుడ్లు తినేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.  రోజుకు రూ.15కోట్లకు చొప్పున నెలలో రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. దీంతో ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డారు. పౌల్ట్రీ  రైతులు దాణా ఖర్చులు బాగా తగ్గించుకుంటున్నారు. దీంతో మొక్కజొన్న, సోయాబీన్‌ అమ్మకాలు, ధరలూ తగ్గాయి. జనవరి మొదటి వారంలో కిలో రూ.28ల వరకు ఉన్న మొక్కజొన్న ఇపుడు రూ. 23కు, కిలో రూ.40లకుపైనే పలికిన సోయాబీన్‌ రూ.27కు పడిపోయింది. అయితే ఉడికించిన చికెన్ తింటే ఎలాంటి ప్రమాదం లేదని వెటర్నరీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అత వేడిలో వైరస్ బతకదని అంటున్నారు. 

Also Read :  భూపాలపల్లి హత్య ఘటనపై సీఎం రేవంత్ సీరియస్.. సంచలన నిర్ణయం!

5,540 పైగా కోళ్లు మృత్యువాత

ఇక 5,540 పైగా కోళ్లు మృత్యువాత పడిన ఘటన  వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామంలో చోటుచేసుకుంది.   గ్రామానికి చెందిన శివకేశవరెడ్డి అనే రైతు తన వ్యవసాయ పొలంలో ఓ షెడ్డును ఏర్పాటు చేసుకుని  కోళ్లను పెంచుతున్నారు.  అయితే గడిచిన రెండు రోజుల్లో సుమారుగా 5 వేల540 కోళ్లు చనిపోయాయి. మృతి చెందిన కోళ్లను గుంత తవ్వి పూడ్చేశారు. సమాచారం అందుకున్న జిల్లా వెటర్నరీ డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, మండల అధికారి విజయ్ వెళ్లి కోళ్లను పరిశీలించి వాటిని ల్యాబ్ కు పంపించారు.  

Also Read :  పనామా హోటల్‌ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!

అయితే చనిపోయిన కోళ్లల్లో ఎలాంటి  బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడం లేదన్నారు. కొక్కెర రోగం సోకినట్టు అనుమానిస్తున్నట్టుగా వెల్లడించారు.  ఐదు కోళ్లను హైదరాబాద్ ల్యాబుకు మరో  మూడు కోళ్లను మహబూబ్ నగర్ ల్యాబు పంపినట్టుగా  అధికారులు తెలిపారు.  ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వీపరితంగా ఉండడంతో కోళ్ల షెడ్లను ఖాళీగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు.  మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ అమ్మకాలు భారీగా పడిపోయాయి. కస్టమర్లు కన్నెత్తిచూడకపోవడంతో చికెన్‌ షాపులు బోసిపోతున్నాయి. మొన్నటివరకు లైవ్‌కోడి కిలోధర రూ.180 ఉండగా.. ఇప్పుడు కాస్త రూ.90కి పడిపోయింది. 

Also read :   సొంత కారు కూడా లేదు .. ఢిల్లీ కొత్త సీఎం ఆస్తులెంత.. అప్పులెంత?

Also Read :  ఏఐజీ హాస్పిటల్‌కు KCR

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంగళవారం ఆయసంతో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి వైద్యులు ఎక్స్పైరీ అయిన ఇంజక్షన్‌ను ఇచ్చారు. అది వికటించడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతదేహాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

New Update
Injuction

Expired Injuction

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంజక్షన్ వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంతకీ అసలేం జరిగిందో తేలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్‌రోడ్డు సమీపంలో హైకేర్‌ ఆస్పత్రికి తరలించారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

ఆ తర్వాత వైద్యులు అతడికి పరీక్షలు చేసి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అక్కడున్న వైద్యులు తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని.. వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని సూచనలు చేశారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే ఐలయ్య మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇలా ఎలా జరిగిందని వైద్యులను నిలదీశారు. 

Also Read: పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

చివరికి ఐలయ్యకు ఇచ్చిన ఇంజక్షన్లను పరిశీలించారు. అయితే ఆ ఇంజక్షన్ మార్చి నెలలోనే ఎక్స్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిసినప్పటికీ కూడా ఇంజక్షన్ ఇవ్వడం ఏంటని వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఐలయ్య మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. దీంతో మృతదేహంతోనే ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుని విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా ఇలా ఇంజక్షన్‌లు వికటించి రోగులు మృతి చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

Also Read: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్‌లో పదిమంది!

rtv-news | telangana 

Advertisment
Advertisment
Advertisment