Paper leakage: నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బిగ్ ట్విస్ట్.. హైకోర్టులో బాధిత స్టూడెంట్ పిటిషన్!

నల్లగొండ జిల్లా నకిరేకల్ లో పదో తరగతి పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారం ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు కు చేరింది. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థిని ఝాన్సీలక్ష్మి హైకోర్టు ను ఆశ్రయించింది.

New Update
Paper leakage

Paper leakage

Paper leakage : నల్లగొండ జిల్లా నకిరేకల్ లో పదో తరగతి పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారం ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు కు చేరింది. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా పేపర్ లీకేజీకి సహకరించిందంటూ విద్యార్థిని ఝాన్సీలక్ష్మి ని అధికారులు డిబార్ చేశారు. అయితే, మొత్తం వ్యవహారంలో తన తప్పేమీ లేదని, పరీక్షకు అనుమతించాలని ఝాన్సీ‌లక్ష్మి అధికారులను వేడుకుంది. ఎవరో ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న తనను బెదిరించి ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసుకుని వెళ్లారని వాపోయింది.

Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ఫోటోలు తీసిన వ్యక్తులు ఎవరో కూడా తనకు తెలియదని బాధితురాలు మీడియా ముందు కన్నీళ్లు పెట్టింది. ఈ క్రమంలోనే విద్యార్థిని ఝాన్సీలక్ష్మి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ను ఆశ్రయించింది. తనపై డీబార్‌ను ఎత్తివేసి.. వెంటనే పరీక్ష రాసేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖాలు చేసింది. అదేవిధంగా విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, నల్గొండ డీఈవో, ఎంఈవో , నకిరేకల్ ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్‌లను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చింది. ఈ మేరకు ఝాన్సీలక్ష్మి పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!


కాగా నల్గొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన విద్యార్థిని టెన్త్ పేపర్ లీకేజీలో వ్యవహారంలో డిబార్ అయింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి నకిరేకల్ పోలీస్‌స్టేసన్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై  కేసు నమోదు అయ్యింది. పది పరీక్షలో మాస్ కాపీయింగ్ నిందితులతో మున్సిపల్ చైర్మన్‌కు సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో కేటీఆర్ ట్వీట్‌పై నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత,శ్రీనివాస్  అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేటీఆర్‌పై నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేటీఆర్‌పై నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. కాంగ్రెస్ నాయకుడు ఉగ్గడి శ్రీనివాస్ కూడా సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు.

Also read: OLA, UBERకు చెక్.. కేంద్రం నుంచి కొత్త యాప్.. అమిత్ షా సంచలన ప్రకటన!

కాగా.. ఈనెల 21న నకిరేకల్‌లో టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగు ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రంలోని 8వ నెంబర్ గది నుంచి తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌ను విధుల నుంచి తొలగించగా.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్‌ను కూడా సస్పెండ్ చేశారు. అంతే కాకుండా ప్రశ్నపత్రం లీకేజ్ అవడానికి ఓ విద్యార్థిని కారణం అంటూ ఆమెను డిబార్ చేశారు. అయితే పేపర్ లీక్‌పై తనకు ఏ పాపం తెలియదని.. ఓ వ్యక్తి కిటీకి వద్దకు వచ్చి పేపర్ చూపించాలని లేకపోతే రాయితో కొడతానని బెదిరించాడని.. అందువల్లే భయంతో పేపర్ చూపించినట్లు వాపోయింది. తనను డిబార్ చేయొద్దని.. పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని విద్యార్థిని వేడుకుంది.

 Also read: Google: గుట్టుచప్పుడు కాకుండా గూగుల్ మీ ప్రతీ మాట వింటోంది.. ఇలా చెక్ పెట్టండి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్‌..

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలుకు మరో ముందుడుగు పడింది. ఈ బిల్లుకు గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. త్వరలో ఎస్సీ వర్గీకరణ అమలయ్యేలా రేవంత్ సర్కార్ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

New Update
Jishnu Dev Vrama

Jishnu Dev Varma

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలుకు మరో ముందుడుగు పడింది. ఈ బిల్లుకు గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గంలో 3 గ్రూపులుగా ఉప కులాలను విభజించి 15 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఈ బిల్లు రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ బిల్లుకు చట్టబద్ధత ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించారు. దీంతో మంగళవారం జిష్ణుదేవ్ వర్మ ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. అయితే రేవంత్ ప్రభుత్వం త్వరలో ఎస్సీ వర్గీకరణ అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఏపీ & తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. భారీ భూకంపం!

గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఒక్కో అడుగు ముందుకెస్తున్న రేవంత్ ప్రభుత్వానికి గవర్నర్‌ నుంచి కూడా ఆమోదం లభించింది. దీనివల్ల ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు కానుంది.  గతేడాది ఆగస్టు 1న ఎస్సీ వర్గీరణకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వడంతో అదే రోజున సీఎం రేవంత్ దీనిపై స్పందించారు. వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటన చేశారు.

Also Read: రేప్ కేసులో ట్విస్ట్.. అంతా ఆమె ఇష్టపూర్వకంగానే జరిగిందని నిందితుడికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు

 దీంతో 2024 సెప్టెంబర్ 12న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ ఉప సంఘాన్ని నియమించారు. విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాత వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిషన్‌ను నియమించాలని ఉపసంఘం సిఫార్సు చేసింది. దీనిపై విస్తృత అధ్యయనం పూర్తయ్యాక ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఉపసంఘానికి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కేబినెట్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. అన్ని పార్టీలు దీనికి మద్దతు తెలిపాయి. 

Also Read: కంచ గచ్చిబౌలి భూవివాదం సెంట్రల్ కమిటీ హైదరాబాద్‌లో వారితో భేటి

sc-classification | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు