Potti Sri Ramulu : పొట్టిశ్రీరాములు పేరు మార్పు..సీఎం రేవంత్ పై ఆర్యవైశ్యుల ఆగ్రహం

హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పును ఆర్యవైశ్యులు వ్యతిరేకిస్తున్నారు. విశ్వవిద్యాలయానికి ఆయన పేరునే కొనసాగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పేరు మార్పుపై రేవంత్‌ రెడ్డిపై ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
potti sreeramulu telugu university

potti sreeramulu telugu university

Potti Sri Ramulu : హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పును ఆర్యవైశ్యులు వ్యతిరేకిస్తున్నారు. విశ్వవిద్యాలయానికి ఆయన పేరునే కొనసాగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పేరు మార్పుపై రేవంత్‌ రెడ్డిపై ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువిశ్వవిద్యాలయంకు పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. దేశభక్తుడైన అమరజీవి పొట్టిశ్రీరాములును కాంగ్రెస్ అవమానిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశస్వాతంత్ర్యం కోసం హరిజన గిరిజన హక్కుల కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాలకోసం తన ప్రాణాలను అర్పించిన పొట్టిశ్రీరాములును ఆంధ్రాకు చెందిన వ్యక్తిగా పరిగణించడం సరైందికాదని మండిపడ్డారు.

ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!

కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పేరు, కాసు బ్రహ్మానందారెడ్డి పార్కు పేరు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పేరు మార్చే దమ్ము సీఎం రేవంత్ కు ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం పేరుమార్పు విషయంలో రాజకీయ పార్టీల మద్దతు కోరుతామని ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ప్రకటించారు. 

Also read: Starbucks : తంతే స్టార్‌బగ్స్‌లో పడ్డాడు.. డెలవరీ బాయ్‌కి రూ. 434 కోట్ల నష్టపరిహారం

పేరు మార్పు సరికాదు- -బండి సంజయ్‌ 

 పొట్టి శ్రీరాములు పేరిటనున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఆ పేరును తొలగిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడుతూ పొట్టిశ్రీరాములు గొప్ప దేశభక్తుడు, గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడని ఆర్యవైశ్యుల ఆరాధ్య నేత అని కొనియాడారు. అట్లాంటి గొప్ప నేత పేరును మార్చాల్సిన అవసరం ఏముందన్నారు. సురవరం ప్రతాపరెడ్డి అంటే మాకు గౌరవముందని, తెలుగు భాష ఉన్నతికి క్రుషి చేశారన్నారు. తెలుగు భాషాభివ్రుద్ధికి ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ఆయన పేరును పెట్టుకుంటే అభ్యంతరం లేదన్నారు.

ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!

కానీ పొట్టి శ్రీరాములు తొలగించి అవమానించడం కరెక్ట్ కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన కులాభిమానంతోనే పొట్టి శ్రీరాములు పేరును తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదించారన్నారు. సీఎం తీరు దేశభక్తులు, స్వాతంత్ర్య సమరయోధులతోపాటు ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. పొట్టి శ్రీరాములంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష ప్రాణాలర్పించిన అమరజీవి మాత్రమే కాదని,గొప్ప దేశభక్తుడన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడని, మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులను వదిలేసుకుని దేశం కోసం పోరాడిన వ్యక్తి అన్నారు. మహాత్మాగాంధీజీ ఇష్టమైన వ్యక్తి. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడన్నారు. సత్యాగ్రహా, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 3సార్లు జైలుశిక్ష అనుభవించాడని, హరిజనోద్యమం కోసం అనేక పోరాటాలు చేసిన నాయకుడన్నారు. మహనీయులను కాంగ్రెస్ పార్టీకి అవమానించడం అలవాటుగా మారిందన్నారు.

ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Habsiguda: హబ్సిగూడలో తగలబడుతున్న కార్.. డ్రైవర్‌కు ఏమైందంటే?

హబ్సిగూడ‌లో భారీ ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ కారును నిలిపివేసి బయటకు వచ్చేయడంతో ప్రమాదం తప్పింది. కారు ఉప్పల్ నుంచి తార్నాక వైపు వెళ్తుండగా హబ్సిగూడ చౌరస్తాకు సమీపంలో ఇది జరిగింది.

New Update
Hyderabad Ghatkesar car fire accident Three burnt alive

Hyderabad Habsiguda car caught fire

హైదరాబాద్‌లోని హబ్సిగూడలో దారుణమైన ప్రమాదం జరిగింది. ఒక కారు మంటల్లో బూడదైపోయింది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు డ్రైవర్ అప్రమత్తమై కారును పక్కకు నిలిపి.. వెంటనే అందులోంచి బయటకు వచ్చేశాడు. ఎలగో అతడు ముందుగా గమనించి బండి దిగడంతో పెను ప్రమాదం తప్పింది.

Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!

కాగా ఆ కారు ఉప్పల్ నుంచి తార్నాక వైపు వెళ్తుండగా హబ్సిగూడ చౌరస్తా రాకముందు ఈ ఘటన సంభవించింది. ఇక వెంటనే సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు సమాచారాన్ని అందుకుని హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ రోడ్డులో ఏర్పడిన ట్రాఫిక్‌ను నియంత్రించే పనిలో పడ్డారు. ఈ విషయం తెలిసి స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ దేవుని దయవల్ల ఏం జరగలేదని మాట్లాడుకుంటున్నారు. 

Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

USలో తెలంగాణ వాసులు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35), మనవడు హార్వీన్ (6), కూతురు అత్త సునీత (56) ప్రాణాలు కోల్పోయారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడంతో టేకులపల్లి గ్రామం శోకసద్రంలో మునిగిపోయింది.

Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు 

హైదరాబాద్‌‌లోనూ ప్రమాదం..

ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం రోడ్డుపై వేగంగా వెళ్తు అదుపు తప్పడంతో మెట్రో పిల్లర్, డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిచారు. కారు మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులోనే కారు నడిపి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. కృష్ణానగర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
Advertisment
Advertisment
Advertisment