మెరాకిల్.. తెగిన చేతిన అతికించిన వైద్యులు, రాష్ట్రంలో ఇదే తొలిసారి!

మంచిర్యాలకు చెందిన పవన్ కుమార్ కి బైక్ యాక్సిడెంట్ లో మోచేయి పైభాగం వరకు తెగిపడిపోయింది. దీంతో హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ వైద్యులు 8గంటలపాటు మైక్రోవ్యాసుకలర్ రీప్లాంటేషన్ శస్త్ర చికిత్స చేసి.. తెగిపడిన చేయిని పూర్తిగా అతికించారు.

New Update
apollo hospital doctors

రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చేయి పూర్తిగా తెగిపోయింది. వెంటనే అతడిని అపోలో హాస్పిటల్ కు తరలించగా.. వైద్యులు గంట సమయంలోనే ఆపరేషన్ ను విజయవంతం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే

మంచిర్యాలకు చెందిన పవన్ కుమార్ అక్టోబర్ 11న బైక్ పై వెళ్తుండగా జారి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి మోచేయి పై భాగం వరకు తెగి పడిపోయింది. వెంటనే తెగిన చేతితో పాటు పవన్ ను మంచిర్యాలలోని ఓ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అయితే అక్కడ నుంచి మళ్లీ హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ కి రిఫర్ చేశారు. అప్పటికే గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన తొలి గంట) దాటిపోయింది. 

Also Read : 'అమరన్' సక్సెస్ మీట్.. నితిన్ హిట్ సాంగ్ ను తెలుగులో పాడిన శివకార్తికేయన్

అయినప్పటికీ అపోలో హాస్పిటల్ వైద్యులు దాదాపు 8 గంటలు శ్రమించి మైక్రోవ్యాసుకలర్ రీప్లాంటేషన్ శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. తెగిపడిన చేయిని పూర్తిగా అతికించడంలో విజయం సాధించారు. ఇలా చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు. ఈ మేరకు అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ మైక్రో సర్జన్ డాక్టర్ జీఎన్ భండారి శస్త చికిత్స వివరాలను మీడియాతో పంచుకున్నారు. 

Also Read : సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని పిటిషన్!

తెగిన వెంటనే ఇలా చేయాలి..

ఎప్పుడైనా శరీర భాగాలు తెగిపడితే వాటిని అతికించే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్ భండారి తెలిపారు. అందుకు సంబంధించి కొన్ని సూచనలు చేశారు. 

Also Read : ట్రేడింగ్ పేరుతో స్కాం.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగికి రూ.2.29 కోట్ల టోకరా

తెగిపోయిన శరీర భాగాలను మొదట నీటితో కడగాలి. 
ఆ తర్వాత పాలిథీన్ కవర్ లేదా అల్యూమినియం కవర్ లో ఉంచాలి. 
ఆ కవర్ ను ఐస్ ప్యాక్ లో పెట్టి హాస్పిటల్ కు తీసుకు రావాలి. 
అలా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని డాక్టర్ భండారి పేర్కొన్నారు. 
అలా కాకుండా తెగిన అవయవాన్ని నేరుగా ఐస్ లో ఉంచితే అవయవం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. 
అప్పుడు తిరిగి అతికించడం సాధ్యం కాదు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment