Dharani Portal: ధరణి స్కామ్.. రూ. 60వేల కోట్ల ప్రభుత్వ భూములు స్వాహా!

ధరణి పోర్టల్‌ ద్వారా కొంత మంది అధికారులు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో సుమారు రూ.60 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని రిటైర్డ్‌ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది. దీనిపై విచారణ జరపాలని సీఎం రేవంత్ కు లేఖ రాశారు.

New Update
Dharani Explainer: ధరణిలో ప్రధాన ప్రాబ్లెమ్స్ ఇవే.. సీఎం రేవంత్ చేసే మార్పులేంటి?

Dharani Portal: గత ప్రభుత్వం భూముల రికార్డుల కోసం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ పై అనేక ఫిర్యాదులు వచ్చిన  సంగతి తెలిసిందే. అయితే తాజాగా ధరణిపై సంచలన స్కామ్ బయటకు వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ను ప్రవేశ పెట్టిన తరువాత కొంత మంది రెవెన్యూ అధికారులు, ఉన్నత అధికారులు ఈ ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని.. చట్టవిరుద్ధంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అప్పగించారాని ఆరోపణలు వచ్చాయి. 

Also Read:  Vizag: విశాఖలో ఫైవ్ స్టార్ హోటల్ కూల్చివేత..

ఈ క్రమంలోనే  దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతులోకి వెళ్ళాయాని రిటైర్డ్‌ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది. ఈ భూదందాపై విచారణ  జరిపించాలని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, హైకోర్టు చీఫ్‌ జస్టిస్ తో పాటు పలు విచారణ ఏజెన్సీలకు లేఖ రాసినట్లు సమాచారం. 

Also Read:  US: ట్రంప్‌ గెలుపు...అమెరికాకు గుడ్‌ బై చెబుతున్న హాలీవుడ్‌ హీరోయిన్లు

1000 ఎకరాల వరకు...

వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా గుట్టల బేగంపేటలోని సర్వే నెంధరణి స్కామ్.. రూ. 60వేల కోట్ల ప్రభుత్వ భూములు స్వాహా!
బర్  63లోని 42ఎకరాలు, గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్  124/10లో 50 ఎకరాలు, సర్వే నెంబర్  36, 37లో 600 ఎకరాలు, హఫీజ్‌పేట సర్వే నెంబర్  80లో 20 ఎకరాలు, మోఖిలా దగ్గర సర్వే నెంబర్  555లో బిల్లాదాఖల భూములు 150 ఎకరాలు, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా, కూకట్‌పల్లి మండలం యల్లమ్మబండ(షాంబిగూడ) పరిధిలో సర్వే నెంబర్  57లో 92 ఎకరాలను చట్టవిరుద్ధంగా విక్రయించారని విజిలెన్స్‌ కమిషన్‌కు రిటైర్డ్‌ రెవెన్యూ అధికారులు రాసిన లేఖలో పేర్కొన్నారు. చేతులు మారిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు.

Also Read: New Train Route: ఏపీలో ఈ రూట్‌లో కొత్త ట్రైన్ మార్గం..!

Also Read: TCS: ఆఫీసుకొస్తేనే బొనస్‌ ఇస్తానంటున్న టీసీఎస్‌!


 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : మీ దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను.. పహల్గా మృతులకు స్మితా నివాళి

పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ నివాళులు అర్పించారు. ‘‘ ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు స్మితా సబర్వాల్ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో వారి దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను’ అని పోస్ట్ చేశారు.

New Update
 Smita Sabharwal

Smita Sabharwal

Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దాడిని ప్రపంచ దేశాలన్ని ఖండించాయి. దేశవ్యాప్తంగా ఉగ్రదాడికి నిరసనగా ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు.దేశంలోని రాజకీయ నాయకులు, ప్రముఖులు, సామాన్యులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని హెచ్చరించారు.

Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ నివాళులు అర్పించారు. ‘‘ ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో వారి దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను’ అని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఈ దాడిని హేయమైన చర్యగా పరిగణిస్తూ ఆమె ఖండించారు.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

అయితే.. స్మితా సబర్వాల్ ఇటీవల కొన్ని వివాదాల కారణంగా వార్తల్లో నిలిచారు. ఆమె సోషల్ మీడియా పోస్టులు.. కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆమె ప్రభుత్వ అధికారిగా ఉంటూ రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ స్మితా సబర్వాల్ తీరుపై కీలక కామెంట్స్ చేశారు. ఐఏఎస్ అధికారిణిగా ఉండి ప్రభుత్వాన్ని నిందించే పోస్టులు పెట్టటం సరికాదని అన్నారు. దాన్ని కన్నా రాజకీయాల్లో చేరితో సరిపోతుంది కదా అని చురకలు అంటించారు.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment