Viral News: బీభత్సం సృష్టించిన యూట్యూబర్‌.. షాకిచ్చిన పోలీసులు..!

హైదరాబాద్‌ - కూకట్‌పల్లి ప్రాంతంలో రోడ్లపై డబ్బులు విసిరేసి బీభత్సం సృష్టిస్తూ రీల్స్ చేసిన హర్షకు పోలీసులు షాక్ ఇచ్చారు. సనత్ నగర్ పీఎస్ లో ఆయనపై కేసు నమోదు చేశారు. డబ్బుల కోసం స్థానికులు ఎగబడడం, ట్రాఫిక్ కు అంతరాయం కలగడం, న్యూసెన్స్ సృష్టించడంపై చర్యలు తీసుకున్నారు.

New Update
Viral News:  బీభత్సం సృష్టించిన యూట్యూబర్‌.. షాకిచ్చిన పోలీసులు..!

Youtuber Harsha: యువతకు రీల్స్ పిచ్చి రోజురోజుకి ముదిరిపోతోంది. లైకుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రోడ్లపై విచ్చలవిడిగా విన్యాసాలు చేస్తున్నారు. రీసెంట్ గా  ఓ యువకుడు హైదరాబాద్‌ - కూకట్‌పల్లి ప్రాంతంలో రోడ్లపై డబ్బులు విసురుతూ రీల్స్ చేశాడు. పవర్ హర్ష అలియాస్ మహదేవ్ అనే యువకుడు యూట్యూబర్ & ఇన్‌స్టాగ్రామర్.

Also Read: ఫార్మా బాధితులను పరామర్శించిన జగన్.. మా హయాంలోనే ఎక్కువ ప్రమాదాలు అంటూ..

రెండు రోజుల క్రితం రోడ్లపై డబ్బులు విసిరేస్తూ స్టంట్స్ చేశాడు. డబ్బుల కోసం స్థానికులు రోడ్లపై ఎగబడడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు హర్షపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అతడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

తాజాగా, యూట్యూబర్‌ హర్షపై పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బులు విసిరేస్తూ రోడ్లపై హల్‌చల్‌ చేశాడని.. ట్రాఫిక్‌ కు ఇబ్బంది కలిగించాడని సనత్‌నగర్‌ పోలీస్ స్టేషన్లో ‌ట్రాఫిక్‌ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో హర్షపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేపీహెచ్‌బీలో కూడా హర్షపై మరో కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియా వీడియోల కోసం, రీల్స్ కోసం, సమాజానికి ఇబ్బంది కలిగేలా ఇలాంటి దుశ్చర్యలు, పిచ్చి చేష్టలు చేస్తే… కఠినమైన కేసులతో చట్టాలు స్వాగతం పలుకుతాయని.. తస్మాత్ జాగ్రత్త అంటూ తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment