Telangana Govt Jobs: తెలంగాణలో మరో 670 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు మంత్రి శుభవార్త

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి జగదీశ్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. త్వరలోనే విద్యుత్ శాఖలో మరో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు.

New Update
Telangana Govt Jobs: తెలంగాణలో మరో 670 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు మంత్రి శుభవార్త

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadeesh Reddy) అదిరిపోయే శుభవార్త చెప్పారు. 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ (Telangana Job Notification) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ లో నూతనంగా జూనియర్ లైన్ మెన్ గా నూతనంగా నియమితులైన 1362 మందికి మంత్రి నియామక పత్రాలను అందజేశారు. శనివారం రాత్రి ఎస్ఆర్ నగర్ లోని జెన్కో ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో విద్యుత్ రంగంలో 35,774 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. అందులో ఔట్ సోర్సింగ్ ద్వారా టీఎస్ఎస్పీడీసీఎల్ నియమించిన 10,312, ట్రాన్స్ కోలో 4,403, జెన్కో లో 3,689, ఎన్పీడీసీఎల్ లో 4,370 మొత్తం కలిపి 22,774 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని వివరించారు.

ప్రత్యక్ష నియామకాల ద్వారా 13,000 మందిని నియమించుకున్నామన్నారు జగదీశ్ రెడ్డి. ఇవి కాకుండా మరో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు 1.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. ఇంకా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కరెంట్ పీక్ డిమాండ్ 5,661 మేఘావాట్లు ఉందన్నారు.
Ts govt jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‎న్యూస్…ఈ శాఖలో 8 వేల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్..!!

అది ఇప్పుడు 174 శాతానికి పెరగడంతో 15,497 మేగా వాట్లకు చేరిందని సంతోషం వ్యక్తం చేశారు. అదే విదంగా తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణా రికార్డ్ సృష్టించిందన్నారు జగదీశ్ రెడ్డి. జాతీయ సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,255 యూనిట్లు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 2,126 యూనిట్లుగా రికార్డు కావాడమే అందుకు నిదర్శనమన్నారు.

దేవంలోనే నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా మాత్రమేనని మంత్రి అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసేది కేవలం ఆరు గంటలు మాత్రమేనని విమర్శించారు. విద్యుత్ రంగం విజయాలలో లైన్ మెన్ ల పాత్ర కీలకంగా ఉంటుందన్న విషయాన్ని కొత్తగా నియమితులైన ఉద్యోగులు విస్మరించరాదని దిశానిర్దేశం చేవారు. రక్షణ చర్యలు తీసుకుంటూ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు జగదీశ్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు

వరంగల్ కి చెందిన సాయి శివాని అనే విద్యార్థిని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ సాయిశివాని రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోనల్ 1లో 11వ ర్యాంకు సాధించింది.

New Update

All India Civil Services సాధారణంగా చాలామంది సివిల్స్ క్లియర్ చాలా కష్టమని భావిస్తారు. కానీ కస్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మరో సారి నిరూపించింది ఈ అమ్మాయి. తెలుగు తేజం సాయిశివాని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

సివిల్స్ లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు 

వరంగల్ కి చెందిన సాయి శివాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసిన సాయి శివాని.. ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టింది. కలెక్టర్  కలతో అహర్నిశలు కష్టపడింది. ప్రణాళికతో రోజుకు 12 గంటలు చదివింది. మొదటి సారి విఫలమైనా.. నిరాశ చెందలేదు. మళ్ళీ కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో  11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.  2023లో ఐదు మార్కులతో సాయిశివాని ప్రిలిమ్స్ మిస్సయింది. తిరిగి 2025లో తన కల నెరవేర్చుకుంది. 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

ఈ సందర్భంగా సాయిశివాని మాట్లాడుతూ.. ఇంతవరకు ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన కల నెరవేరడానికి కారణమని తెలిపింది. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేశాను. రోజుకు 12 గంటలు చదివాను. ఒత్తిడిని జయించడానికి యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఈ విజయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం మరువలేనిది అని చెప్పింది. 

latest-news

Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

Also Read: Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

Advertisment
Advertisment
Advertisment