Gadari Kishore: కోమటిరెడ్డి బ్రదర్స్ కు మెంటల్.. వారికిదే నా సవాల్: గాదరి కిషోర్

తుంగతుర్తిలో తాను హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తన విజయావకాశాలు రెండింతలు అయ్యాయన్నారు. తనపై విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు మెంటల్ అంటూ ధ్వజమెత్తారు.

New Update
Gadari Kishore: కోమటిరెడ్డి బ్రదర్స్ కు మెంటల్.. వారికిదే నా సవాల్: గాదరి కిషోర్

కోమటిరెడ్డి బ్రదర్స్ కు మెంటల్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ (Gadari Kishore Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు కల్లు తాగిన కోతుల మాదిరిగా ఎగురుతారని ఎద్దేవా చేశారు. ఇసుక మీద తాను ఒక్క రూపాయి తీసుకున్నట్లు వారు నిరూపించినా పోటీ నుంచి తప్పుకుంటాన్నారు. నిరూపించకుంటే మీరు తప్పుకుంటారా? అని కోమటిరెడ్డి బ్రదర్స్ కు సవాల్ విసిరారు. ఇసుక, మట్టి అమ్ముకుంటూ కాంట్రాక్టులు చేసుకునేది వారేనంటూ ధ్వజమెత్తారు. తాను కష్టపడి చదువుకుని, ఉద్యమం చేసి పైకి వచ్చాన్నారు. తుంగతుర్తిలో తన హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: KCR: చిప్పకూడు తిన్నా సిగ్గు రాలే.. నీతి లేనోడు: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ స్ట్రెయిట్ అటాక్

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తన విజయావకాశాలు మరో రెండింతలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దిక్కు లేరన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంట్రాక్టుల బిల్లుల కోసమే నాడు కాంగ్రెస్ నేతలు కాల్వలు తొవ్వించారని ధ్వజమెత్తారు. మెత్తటి మట్టి వచ్చిన దగ్గర తొవ్వి.. బండ ఉన్న దగ్గర వదిలేశారని ఆరోపించారు. ఆనాడు నీళ్లు లేకున్నా.. వారు కాల్వలు ఎందుకు తీశారు? అని ప్రశ్నించారు.

తుంగతుర్తి ఇంకా మంచిగ కావాలంటే మళ్లీ ఇక్కడ గులాబీ జెండా ఎగురవేయాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, దగ, స్కామ్ లు అంటూ విమర్శలు గుప్పించారు. గాదరి కిషోర్ ఆర్టీవీకి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Revanth Reddy: రాజాసింగ్ కు సీఎం రేవంత్ లేఖ.. ఎందుకో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు లేఖ రాశారు. ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

New Update
CM Revanth Letter To BJP MLA Raja Singh

CM Revanth Letter To BJP MLA Raja Singh

బీజేపీ గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి, ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.

Also Read :  నన్నే డబ్బులు అడుగుతారా? మీ అంతు చూస్తా..టోల్ సిబ్బందిపై దాడి

Revanth Reddy Letter To Raja Singh

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

ఈ లేఖను రాజాసింగ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. పుట్టినరోజు శుభ సందర్భంగా శుభాకాంక్షలు పంపినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి నా హృదయపూర్వక ధన్యవాదాలంటూ పోస్ట్ చేశారు. ఇంకా కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులు రాజాసింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. 

Also Read :  మీ గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ గవాస్కర్ .. వినోద్ కాంబ్లీకి సాయం!

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

 

revanth-reddy | goshamahal mla raja singh | latest telangana news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telangana-politics

Advertisment
Advertisment
Advertisment