CM Revanth: తెలంగాణకు మరో సంచలన అధికారి.. రేవంత్ రెడ్డి వ్యూహం అదేనా?

పూరీ జగన్నాథ్, రవితేజ, ఛార్మీ.. ఇలా సినీ ప్రముఖులను డ్రగ్స్ కేసులో స్టేషన్ కు పిలిపించి సంచలనం సృష్టించిన అకున్ సభర్వాల్ ఐపీఎస్ గుర్తున్నారా? కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆ అధికారిని రేవంత్ సర్కార్ మళ్లీ రాష్ట్రానికి పిలిపిస్తోంది. ఎందుకో ఈ ఆర్టికల్ లో చదవండి.

New Update

'తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడాలి... డ్రగ్స్ మహమ్మారితో కుటుంబం, వ్యవస్థ నాశనమవుతాయి.. ఉద్యమాలకు కేరాఫ్‌గా ఉన్న తెలంగాణలో దురదృష్టవశాత్తు గల్లీ గల్లీలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగింది.. డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాల్లో సినిమా పరిశ్రమ కూడా భాగస్వామ్యం కావాలి.. ఇది పాటించిన వారికే ప్రభుత్వ వెసులుబాట్లు, సహకారం అందించాలి..' ఈ మాటలన్నది ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా..! తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి డ్రగ్స్‌పై రేవంత్‌రెడ్డి ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌పై ఓ కన్నేసి ఉంచారు. సమయం దొరినిప్పుడల్లా టాలీవుడ్‌లోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. ఇక ఇదే క్రమంలో మరోసారి డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక అడుగు వేశారు. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించిన IAS అకున్ సబర్వాల్‌ను మరోసారి తెలంగాణకు తీసుకొస్తున్నారు.

తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా..

తెలంగాణలో డ్రగ్స్‌ రక్కసిని పూర్తిగా రూపుమాపేందుకు రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నారు.  స్మితా సబర్వాల్ భర్త అకున్ సబర్వాల్‌ని తెలంగాణకు తిరిగి తీసుకురావటం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహం ఇదేనంటున్నారు విశ్లేషకులు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలని నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి.. ఇప్పటికే కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. అటు టాలీవుడ్‌ స్టార్లు సైతం ఇప్పటికే డ్రగ్స్‌కు వ్యతిరేకంగా షార్ట్ వీడియోలు చేసి రిలీజ్ చేస్తున్నారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌ ఇప్పటికే ఈ తరహా వీడియోలు చేశారు కూడా. మరోవైపు టాలీవుడ్‌ను రేవంత్‌ ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టుగా అర్థమవుతోంది. అయితే ఇది టాలీవుడ్ పెద్దలకు మాత్రం టార్గెట్‌లా అనిపిస్తోందని వారి బిహేవియర్ చూసిన కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: TS: రేవంత్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్.. మూసీ కూల్చివేతలపై స్టే!

Akun sabharwal smitha sabharwal

ఎన్‌కన్వేషన్‌ కూల్చివేతలతో టాలీవుడ్ లో ప్రకంపనలు..

నాగార్జునకు చెందిన ఎన్‌కన్వేషన్‌ను కూల్చడం టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపింది. హైదరాబాద్‌లో చెరువులు, కాలువలపై నిర్మించిన కట్టడాలను హైడ్రా పేరిట రేవంత్‌ సర్కార్‌ కూల్చివేసింది. అందులో నాగార్జున్‌కు చెందిన ఫంక్షన్‌ హాల్‌ ఉండడం రచ్చకు దారి తీసింది. ఆ సమయంలో సినీ పెద్దలంతా మౌనం పాటించారు. ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ చర్యపై మాట్లాడలేదు. ఇక నంది అవార్డ్స్‌ పేరు గద్దర్ అవార్డులగా పేరు మార్చిన నిర్ణయాన్ని కూడా ఇండస్ట్రీ పెద్దలు స్వాగతించినట్టు కనిపించలేదు. అయినా రేవంత్‌ మాత్రం తన పని తాను చేసుకుపోయారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలోనే ఉంటాం.. క్యాట్ ను ఆశ్రయించిన ఐఏఎస్ లు!

sabhavarwal ias ips

ఇబ్బంది పెట్టిన సురేఖ వ్యాఖ్యలు..

ఇలా రేవంత్‌ వర్సెస్‌ టాలీవుడ్‌ కోల్డ్‌ వార్‌ జరుగుతున్న సమయంలో కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలు రేవంత్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. అక్కినేని నాగ చైతన్య-సమంత విడిపోవడానికి కేటీఆర్ కార‌ణ‌మంటూ కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ మొత్తం భగ్గుమన్నది. అలాగే.. కేటీఆర్ కార‌ణంగా చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని టాలీవుడ్‌కు దూరంగా వెళ్లిపోయారంటూ ఆమె చేసిన ఆరోప‌ణ‌లను టాలీవుడ్‌ ముక్త కంఠంతో ఖండించింది. 

ఇది కూడా చదవండి: Muthyalamma : అమ్మవారి విగ్రహం ధ్వంసం.. ఆలయం వద్ద పెరిగిన ఉద్రిక్తత

ఒక్కటైన టాలీవుడ్..

ఎన్‌కన్వెన్షన్‌ను కూల్చివేయ‌కుండా ఉండేందుకు బదులుగా సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశార‌ని కొండాసురేఖ ఆరోపించారు. సమంతని తన వద్దకు వెళ్లమని నాగార్జున కోరగా ఆమె వెళ్లేందుకు నిరాకరించిందన్నారు. దీని కార‌ణంగా నాగ చైత‌న్య-స‌మంత విడాకులు తీసుకున్నార‌న్నారు. అయితే సమంతతో పాటు మొత్తం టాలీవుడ్‌ కొండాసురేఖ కామెంట్స్‌పై మండిపడింది. ఈ విషయంపై నాగార్జున ఇప్పటికే కోర్టు తలుపుతట్టారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో టాలీవుడ్‌ స్పందించిన తీరు చూస్తే ఒకటి మాత్రం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. తమ జోలికి రావద్దంటూ ప్రతీ ఒక్కరూ పరోక్షంగా రేవంత్‌కు వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యారు.

ఇది కూడా చదవండి: కొండా సురేఖపై క్రిమినల్ కేసు.. కేటీఆర్ కు కోర్టు కీలక ఆదేశాలు!

డ్రగ్స్ బాబులను ఇబ్బంది పెట్టేందుకే..

అటు రేవంత్‌ మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించారు. ఈ విషయాన్ని అసలు పెద్దగా పట్టించుకోనట్టే కనిపించారు. ఇక కొండాసురేఖపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇది టాలీవుడ్‌ పెద్దలకు మరింత కోపం తెచ్చినట్టుగానే అనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో డ్రగ్స్‌పై ఫోకస్ పెంచే విధంగా అకున్‌ సబర్వాల్‌ను తెలంగాణకు తీసుకువస్తుండడం టాలీవుడ్‌ డ్రగ్స్‌ బడాబాబులను ఇరుకున పెట్టేందుకేనన్న ప్రచారం జరుగుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment