Kaleshwarm Project: రూ. 50 వేల కోట్లు బొక్కిన మేఘా కృష్ణా రెడ్డి.. సీబీఐ విచారణ?

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 50 వేల కోట్ల కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి బొక్కేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ప్రతిపక్షంలో ఉండి సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నిస్తున్నారు.

New Update
Kaleshwarm Project: రూ. 50 వేల కోట్లు బొక్కిన మేఘా కృష్ణా రెడ్డి.. సీబీఐ విచారణ?

Kaleshwarm Project: తెలంగాణలో ఇప్పుడంతా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి(Kaleshwaram Corruption)పై బిగ్ డిస్కషన్ నడుస్తోంది. మీడియాలో, సోషల్ మీడియాలో, పొలిటికల్ పార్టీల్లో ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మొదలు.. నిర్మాణం పూర్తి అయిన తరువాత కూడా ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల మేడిగడ్డ(Medigadda Barrage) బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడంతో ఈ ఆరోపణలు మరింత పీక్స్‌కు చేరాయి. అయితే, బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్(Congress) నేతలు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అప్పటి పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అనేకసార్లు లేఖలు కూడా రాశారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో ప్రజల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందా? అవినీతిపై ఏ నిర్ణయం తీసుకుంటుందా? అని ఎదురు చూస్తూ వచ్చారు. అందరూ అనుకున్నట్లుగానే.. కాంగ్రెస్ నేతలు విపక్షంలో ఉన్నప్పుడు చేసిన తీవ్ర అవినీతి ఆరోపణలకు కొనసాగింపుగా శుక్రవారం నాడు ఐదుగురు మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించింది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ మేడిగడ్డ బ్యారేజీ కుంగిన పిల్లర్‌ను పరిశీలించారు మంత్రులు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు భారీ అవినీతి జరిగిందని, ప్రాజెక్టులో భాగమైన 3 బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయని ఆరోపించారు. ప్రాజెక్టు విషయంలో బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లు ఎవరినీ వదలబోమని స్పష్టం చేశారు. న్యాయ విచారణ చేపట్టి.. బాధ్యులపై చర్యలు చేపడతామన్నారు.

కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సీబీఐ విచారణ డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు ఆ ప్రస్తావన తీసుకురావడం లేదని ప్రశ్నించారు. న్యాయ విచారణ కాకుండా.. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేఘా కృష్ణా రెడ్డిపై (Megha Krishna Reddy) రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తు చేస్తున్నారు. సీబీఐ (CBI) విచారణ కోరుతూ లేఖలు సైతం రాశారన్నారు. ఈ ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు మేఘా కృష్ణా రెడ్డి కొట్టేశారని ఆరోపించారని, ఇప్పుడు కనీసం కాంట్రాక్టర్ పేరు కూడా ఎత్తడం లేదని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. నాడు అన్ని ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు విచారణ చేయించడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రక్టర్ మేఘా కృష్ణా రెడ్డి దాదాపు రూ. 50 వేల కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారన్న కాంగ్రెస్ నేతల విమర్శలను ప్రస్తావిస్తున్నారు. మరి సీబీఐ విచారణకు ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు బీజేపీ నేతలు.

Also Read:

దూర ప్రయాణం చేస్తున్నారా? వీటిని పాటిస్తే ఏ సమస్యా ఉండదు..!

సామాన్యుడికి ఇంటికి ప్రధాని మోదీ.. ఓ కప్పు టీ తాగి సరదాగా ముచ్చట్లు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG Breaking: కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్..

బోర్డర్ దగ్గర పాకిస్తాన్ అప్పుడే కాల్పులను ప్రారంభించేసింది. నిన్న రాత్రి కూడా పలు చోట్ల కాల్పులు జరిపిన  దాయాది దేశం ఈరోజు ఉదయం నుంచి మరింత వేగం పెంచింది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. 

author-image
By Manogna alamuru
New Update
india

Pakistan Started Firing

పాకిస్తాన్ కయ్యానికి కాలు తెగ దువ్వుతోంది. ఉగ్రవాదులను ప్రేరేపించి భారత్ లో టూరిస్టుల ప్రాణాలు పోయేలా చేసిందే కాకుండా ఇప్పుడు భారత్ తో యుద్దం చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఇండియా సంయమనంతో ఉండాలని చూస్తోంది కానీ ఆ దేశం మాత్రం అలా అనుకోవడం లేదు. నిన్న రాత్రి నుంచి నియంత్రణ రేఖ దగ్గర కాల్పుల తో చెలరేగిపోతోంది. అయితే దీనికి సిద్ధంగానే ఉన్న భారత సైన్యం వాటికి ధీటుగా సమాధానమిస్తోంది. భారత్, పాక్ సీజ్ ఫైర్ ఎత్తేసారని వార్తలు వచ్చాయి. అయితే ఇరు దేశాలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు పాకిస్తాన్ చర్యల వలన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది.  

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు..

పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత దేశం మొత్తం కోపంతో రగిలిపోతోంది. ఈ దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. ఇందులో సింధు జల ఒప్పందం, పాకిస్తానీయుల వీసాల రద్దు, భారతదేశం నుంచి పాకిస్తానీయులు వెళ్ళిపోవాలని వంటి ఆంక్షలను విధించింది.ఇదే సమయంలో ఉగ్రదాడికి పాల్పడిన వారు, దానికి సహకరించిన వాళ్ళు కూడా 'నాశనం' చేయబడతారని ప్రధాని మోదీ గురువారం స్పష్టం చేశారు.  ఇంత జరిగినా పాక్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. భారత్ లానే ఆ దేశం కూడా ఒప్పందాలను రద్దు చేసుకుంది. దౌత్య సంబంధాలను తెగ్గొట్టుకుంది. అదికాక ఇప్పుడు బార్డర్ లో కాల్పులకు తెర తీసింది. నిన్న రాత్రి నుంచి పలు చోట్ల కాల్పులు జరుపుతూనే ఉంది పాక్ సైన్యం. అయితే ఇప్పటికే సిద్ధంగా భారత సిపాయిలు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు రఫెల్ యుద్ధ విమానాలు కూడా బయలుదేశాయి. అలాగే సముద్రంలో ఐఎన్ఎస్ నౌక యుద్ధానికి రెడీగా ఉంది. 

కాశ్మీర్‌కు ఆర్మీ చీఫ్‌

తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్విదేది నేడు జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. శ్రీనగర్‌, ఉదమ్‌పూర్‌లో పర్యటించనున్నారు. కశ్మీర్‌ లోయలోని ఆర్మీ కమాండర్లు, మిగతా భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.

today-latest-news-in-telugu | india | pakistan | border | firing

Advertisment
Advertisment
Advertisment