/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/9-5-jpg.webp)
తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో అక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. ప్రత్యర్థిపార్టీల నుంచి పోటీ సంగతి పక్కనపెడితే...అధికారపార్టీని ఇరకాటంలో పెట్టేందుకు గ్రౌండ్ వర్క్ చకచకా జరుగుతోంది. సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు కాయితీ లంబాడాలు రెడీ అవుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వెయ్యికిపైగా లంబాడాలు కేసీఆర్ ను ఢీకొడతామంటున్నారు. దీంతో అధికారపార్టీలో కొత్త టెన్షన్ షురూ అయ్యింది.
తెలంగాణలో మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఎవరి రచనల్లో వారున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఈ దఫా కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో అక్కడ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ కొత్త తలనొప్పి వచ్చిపడింది. అదేంటంటే సీఎం కేసీఆర్ పై వెయ్యికిపైగా కాయితీ లంబాడాలు పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. 1,016 లంబాడాలను పోటీలోకి దింపుతున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ తెలిపారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను మండలాలవారిగా ఆయన ప్రకటించారు. ప్రస్తతం ఓసీ జాబితాలో ఉన్న కాయితీ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కేసీఆఱ్ ఇఛ్చిన గడువు ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సీఎం తన నిర్ణయాన్ని ఇప్పటికైనా వెల్లడించనట్లయితే..మూడు, నాలుగు రోజుల్లో సచివాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: నేటితో ముగుస్తున్న చంద్రబాబు రిమాండ్..నెక్ట్స్ ఏం జరగబోతోంది..!!
ఇక కాయితీ లంబాడీలను ఎస్టీజాబితాలో చేర్చాలంటూ గతకొన్నాళ్లుగా పోరాటు చేస్తున్నారు. పోడు పట్టాలతోపాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వాడు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గతకొన్నాళ్లుగా నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఏక్తా ర్యాలీ కూడా చేపట్టారు. దశాబ్దాలుగా తమకు తీరని అన్యాయం జరుగుతుందని తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని పోడు పట్టాలు ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఈ ఐదు పండ్లు తింటే రోగాలు పరార్.. అవేంటంటే?
కాగా ఈ సారి కేసీఆర్ తన సిట్టింగ్ నియోజకవర్గమైన గజ్వేల్ తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ పై పోటీ చేసి తమ సత్తా ఏంటో నిరూపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ జిల్లాలో లంబాడీలు ఎక్కువగా ఉంటారు. దాదాపు 22వేల మంది ఓటర్లు వీరే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. వారు కేసీఆర్ పై పోటీ చేస్తే బీఆర్ఎస్ కు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది.
KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు
BRS meeting
KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
కాంగ్రెస్ ను తిరస్కరించండి
‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్
ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్