IPL 2024 Young Gun: రోజు రోజుకు రాటుదేలుతున్న టీమిండియా కుర్రాడు!

ఈ మెగాటోర్నీకి ముందు టీ20 వరల్డ్ కప్ రేసులో ఆ కుర్రాడు దరిదాపుల్లో కూడా లేడు. కానీ.. టోర్నీ మొదలయ్యాక లెక్కలన్నీ మారిపోయాయి. ఆడిన ఏడు మ్యాచుల్లో 318 పరుగులు చేశాడు ఆ యువ ఆటగాడు.అతను ఎవరో తెలియాలంటే ఓ లుక్కేయండి.

New Update
IPL 2024 Young Gun: రోజు రోజుకు రాటుదేలుతున్న టీమిండియా కుర్రాడు!

ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌లో మరో మ్యాచ్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ (KKR vs RR) థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. దీంతో తన జోరును కొనసాగించింది సంజూ శాంసన్ సేన.ఈ విజ‌యంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ సీజన్‌లో ఏడు మ్యాచులాడిన రాజస్థాన్ రాయల్స్ ఆరు విజయాలతో టాప్ లేపింది. ఇక, ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దీంతో.. ఐపీఎల్ పై  బీసీసీఐ సెలెక్టర్లు ఓ కన్నేశారు

ధనాధన్ లీగ్ లో రాణించిన కుర్రాళ్లకి పొట్టి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ లు కూడా ఐపీఎల్ పై ఓ కన్నేశారు. అయితే.. ఓ కుర్రాడు ఇప్పుడు రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ లకు లేనిపోని టెన్షన్ తెస్తున్నాడు.ఈ మెగాటోర్నీకి ముందు టీ20 వరల్డ్ కప్ రేసులో ఆ కుర్రాడు దరిదాపుల్లో కూడా లేడు. కానీ.. టోర్నీ మొదలయ్యాక లెక్కలన్నీ మారిపోయాయి. ఆ కుర్రాడి తన బ్యాటింగ్ తో రేసులో ఇప్పుడు అందరికన్నా ముందున్నాడు.

ఆ యంగ్ గన్ ఎవరో కాదు.. రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్. ప్రతి సీజన్ బిల్డప్ బాబాయ్ అంటూ ట్రోలర్స్ చేతికి అడ్డంగా దొరికే రియాన్ పరాగ్. ఈ సారి సీజన్ లో మనోడు ఓవర్ యాక్షన్ చేయడం లేదు. కానీ, తన బ్యాట్ తో అంతకుమించిన విధ్వంసం చేస్తూ.. హైలెట్ గా నిలుస్తున్నాడు.లేటెస్ట్ గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు రియాన్ పరాగ్. కేవలం 14 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. జోస్ బట్లర్‌కి సరైన సహకారం అందించి.. రాజస్థాన్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు.

ఈ ఒక్క మ్యాచులోనే కాదు.. సీజన్ మొదలైన దగ్గర నుంచి తన సత్తా ఏంటో చాటి చెబుతున్నాడు రియాన్. ఆడిన ఏడు మ్యాచుల్లో 318 పరుగులు చేశాడు. అతని ఖాతాలో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 161. యావరేజ్ 63. ఈ లెక్కలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారుఈ ప్రదర్శనతో వరల్డ్ కప్ రేసులో ఉన్నానంటూ చాటకనే చాటి చెప్పాడు. అయితే పరాగ్‌ ఎప్పుడూ తన ఆటతో కంటే తన వింత చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో ఎక్కేవాడు. కానీ ఇప్పుడు ఆటతో కూడా అందరిని ఆకట్టుకుకుంటున్నాడు ఈ అస్సాం ఆల్‌రౌండర్‌. ఇనాళ్లు ఈ కుర్రాడిని తప్పుగా అర్థం చేసుకున్నామని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీంతో.. టీ20 వరల్డ్ కప్ జట్టులోకి ఈ కుర్రాడిని తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  

New Update
Inter Supplementary Exams

Inter Supplementary Exams

Inter Supplementary Exams:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. కాగా ఇంటర్‌ ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత సాధించింది. గతం కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఆధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  


 Also Read :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
 
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా ఫేయిలై విద్యార్థులు సబ్జెక్టులను బట్టి  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి.  

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!


ఈరోజు (శనివారం) ఉదయం సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్  ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి అత్యధికంగా పాస్‌ పర్సంటేజ్ నమోదు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రతీఏడు లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా.. బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

Advertisment
Advertisment
Advertisment