Lokesh: షర్మిలకు ప్రాణహాని.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌కు లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చెప్పే జబ్బు వచ్చిందని లోకేష్ సెటైర్లు వేశారు. తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి బయటకు నెట్టేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. ప్రాణహాని ఉందని జగన్ చెల్లెలు షర్మిల బయటకు వచ్చి చెబుతున్నారని అన్నారు.

New Update
Lokesh: షర్మిలకు ప్రాణహాని.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh about YS Sharmila: టెక్కలి శంఖారావం సభలో టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సీఎం జగన్ (CM Jagan) పై విమర్శల దాడికి దిగారు. ఆంధ్ర ప్రదేశ్ ను సర్వ నాశనం చేసేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారని అన్నారు. జగన్ జైలుకు వెళ్ళడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. బూటకపు హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై సీఎం జగన్ మాట తప్పారని పేర్కొన్నారు.

ALSO READ: టార్గెట్ 17.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: కిషన్ రెడ్డి

జగన్ కు ఓ జబ్బు...

సీఎం జగన్ కు ఓ జబ్బు ఉందని ఎద్దేవా చేశారు లోకేష్. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చెప్పే జబ్బు జగన్ కు వచ్చిందని చురకలు అంటించారు. తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి బయటకు నెట్టేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. ప్రాణహాని ఉందని జగన్ చెల్లెలు షర్మిల (YS Sharmila) బయటకు వచ్చి చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అన్ని ధరలు పెంచి సీఎం జగన్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అయ్యారు.

జగన్ కట్టింగ్ మాస్టర్...

జగన్ పేదవాడు అని చెప్పుకుంటున్నాడని.. రూ.లక్ష విలువ చేసే చెప్పులు వేసుకునే వ్యక్తి పేద వాడు అవుతాడా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ కట్టింగ్, ఫిట్టింగ్ మాస్టర్ అని చురకలు అంటించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న సీఎం జగన్.. రాష్ట్రంలో ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అన్న తెరిపించారా? అని ప్రశ్నించారు. ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. భయంఅసలు మన బయోడేటాలోనే లేదని అన్నారు లోకేష్ (Lokesh). సీఎం జగన్ పోలీసుల పొట్ట కొట్టాడని విమర్శించారు. చట్టాన్ని ఉల్లఘించిన వ్యక్తుల డేటా రెడ్ బుక్ లో (Red Book) ఉందని హెచ్చరించారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని అన్నారు. ఎవరు అధైర్య పడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజల సమస్యలు తీరిపోతాయని అన్నారు.

ALSO READ: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్… కాంగ్రెస్‌లోకి బొంతు రామ్మోహన్?

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు